ప్రకాశం జిల్లాలో రెండు విషాద ఘటనలు.. ఏడుగురు మృతి

Road Accident In Prakasam District - Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో ఒకేరోజు రెండు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. బెస్తవారిపేట మండలం పెంచకలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ ఆటోను డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నాలుగు ఆవులు కూడా చనిపోయాయి.

చదవండి: పుట్టింటికి పంపలేదని భర్తపై అలిగి.. ఇంట్లో ఎవరూలేని సమయంలో..

ఇదిలా ఉండగా, జిల్లాలోని చినగంజాం మండలం సోపిరాల రైల్వే గేటు సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి.. ఇద్దరు పిల్లలతో సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల వివరాలు తెలియాల్సి వుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top