Nalgonda Road Accident: మిర్యాలగూడలో ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

Road Accident At Nalgonda Miryalaguda - Sakshi

సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హై స్పీడ్‌తో వెళ్తున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై హనుమాన్‌పేట బైపాస్‌ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి టూ టౌన్‌ పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

అయితే, 27 మంది ప్రయాణికులతో బస్సు.. హైదరాబాద్‌ నుండి బాపట్ల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప‍్రమాదానికి డ్రైవర్‌ అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top