కలకలం: పట్టపగలు.. చేతిసంచిలో 20 నాటు బాంబులు

Police Arrested A Man Who carrying Country Bombs - Sakshi

పోలీసుల తనిఖీల్లో బట్టబయలు 

ఉలిక్కిపడిన చిత్తూరు జిల్లా 

వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా): పట్టపగలే ఓ వ్యక్తి చేతిసంచిలో నాటుబాంబులు తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడిన ఘటన శనివారం చిత్తూరు జిల్లాలో తీవ్ర ప్రకంపనలు రేపింది. వివరాల్లోకి వెళితే.. వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణపల్లె సమీపంలోని మహేశ్వరపురం ఎస్టీ కాలనీకి చెందిన దొరస్వామి (37) తీసుకెళ్తున్న ఓ చేతిసంచిని అనుమానంతో పోలీసులు తనిఖీ చేశారు.

ఆ సంచిలో ఉన్న నాటు బాంబులను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి.. దొరస్వామిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బాంబులు ఎందుకోసం తీసుకొస్తున్నారు? ఎక్కడ నుంచి తెస్తున్నారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. చేతిసంచిలో సుమారు 20 నాటు బాంబులు ఉన్నట్లు తెలిసింది. దర్యాప్తు కొనసాగుతున్నదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని  ఎస్‌ఐ గోపి తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top