కొడుకు కోసం 24 మందిని మోసం చేసింది | Mother Cheats 24 People To Rescue Her Son From Debt | Sakshi
Sakshi News home page

కొడుకు కోసం 24 మందిని మోసం చేసింది

Jan 31 2021 11:35 AM | Updated on Jan 31 2021 4:53 PM

Mother Cheats 24 People To Rescue Her Son From Debt - Sakshi

రూపాల్‌ పాండ‍్య

తల్లి రూపాల్‌ నడుం బిగించింది..బ్యూటీ పార్లర్‌ నడుపుతున్న ఆమె...

ముంబై : కుమారుడు చేసిన కోట్ల రూపాయల అప్పులు తీర్చడానికి 24 మందిని మోసం చేసిందో మహిళ. ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్పి 2 కోట్ల రూపాయలు దోచేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ములంద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న రూపాల్‌ పాండ‍్య అనే మహిళ కుమారుడు ఇషాన్‌ పెళ్లయిన తర్వాత దుబాయ్‌లో స్థిరపడ్డాడు. జూదం అలవాటున్న అతడు అక్కడి ఓ క్యాషినోలో 2 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో కుమారుడు చేసిన అప్పులు తీర్చడానికి తల్లి రూపాల్‌ నడుం బిగించింది.
( ప్రేమికుడి బాబా వేషం.. గడ్డం లాగడంతో..)

బ్యూటీ పార్లర్‌ నడుపుతున్న ఆమె ఎక్కువ వడ్డీ ఇస్తానంటూ కస్టమర్లు, పరిచయస్తుల దగ్గర అప్పులు చేసింది. ఇలా 2 కోట్ల రూపాయలు తీసుకుంది. తిరిగిస్తానన్న సమయం దాటిపోతున్నా రూపాల్‌ డబ్బు ఇవ్వకపోవటంతో అప్పిచ్చిన వారంతా ఒక్కొక్కరిగా పోలీసులకు పిర్యాదు చేశారు. ఆమెపై మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. రూపాల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement