పదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. భార్యపై అనుమానంతో...

Married Woman Assasinate Tragedy In Adilabad - Sakshi

సాక్షి, కోటపల్లి(ఆదిలాబాద్‌): కోటపెల్లి గ్రామానికి చెందిన సుందిళ్ల చాముండేశ్వరీ (30) అనే వివాహిత వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై శ్యాముల్‌ తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సుందిళ్ల అశోక్‌ పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన చాముండేశ్వరిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. తాగుడుకు బానిసైన అశోక్‌ కొన్ని రోజుల నుంచి భార్యపై అనుమానం పెంచుకుని శారీరకంగా, మానసికంగా హింసించేవాడు.

మూడు రోజుల క్రితం కూడా మద్యం తాగి వచ్చిన అతను భార్యను తీవ్రంగా కొట్టి, కుమారుడు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అదే సమయంలో అశోక్‌ తల్లి చిన్న అంకు దంపతులు ఉండే ఇంటికి తాళం వేయడంతో చాముండేశ్వరి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈక్రమంలో మనస్తాపానికి గురైన చాముండేశ్వరి బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన ఆమె తల్లి లక్ష్మక్క 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి భర్త అశోక్, అత్త చిన్న అంకుపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వెల్లడించారు. 

చదవండి: మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు...

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top