వాటర్‌ బాటిల్‌ కొనలేదని మహిళపై వ్యాపారి దాడి

Man Attacks On Woman Who Refuses To Purchase Water Bottle In Hyderabad - Sakshi

మహిళపై ఫుట్‌పాత్‌ వ్యాపారి దాడి

వస్తువు కొనుగోలు చేయలేదని ఆగ్రహం పెంచుకున్న వైనం

బాధితురాలి ఫిర్యాదు.. కేసు నమోదు

సాక్షి, రాంగోపాల్‌పేట్‌: వస్తువులు కొనుగోలు చేయలేదని మహిళను ఫుట్‌పాత్‌ వ్యాపారి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహించిన మహిళ చెంప దెబ్బకొట్టింది. మరింత ఆగ్రహానికి లోనైన వ్యాపారి మహిళపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అడ్డగుట్టకు చెందిన లక్ష్మి హౌస్‌కీపింగ్‌ చేస్తోంది. బుధవారం రెతిఫైల్‌ బస్టాప్‌ మీదుగా ఆటోలో ఇంటికి వెళ్లేందుకు నడుచుకుంటూ తన స్నేహితురాలితో కలిసి వెళ్తోంది.

రేతిఫైల్‌ బస్టాండ్‌ ఎదురుగా ఖాజా వాటర్‌ బాటిళ్లు విక్రయిస్తుండగా లక్ష్మి ఎంత? అని అడిగింది. ధర ఎక్కువ చెప్పడంతో వద్దని వెళ్తుండగా ఖాజా ఆమెను బూతులు తిట్టాడు. ఆగ్రహానికి లోనైన ఆమె చెంప చెల్లుమనిపించింది. దీంతో ఫుట్‌పాత్‌ వ్యాపారి ఆమెపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. వెంటనే ఆమె గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే వ్యాపారి గతంలోనూ వినియోగదారుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు అయినట్లు తెలిసింది. 

స్టేషన్‌ వద్ద వ్యాపారిపై దాడి 
మహిళ ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు ఖాజాను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. అదే సమయంలో మహిళ బంధువు ఒకరు అక్కడికి చేరుకుని ఖాజాపై దాడి చేశాడు. దీంతో అతడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

చదవండి: లాఠీచార్జి అంటూ ప్రచారం: యూట్యూబ్‌ చానల్‌పై కేసు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top