ఉగ్ర కుట్ర: రూ. 50 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

JK Police Busts Narco Terror Module Heroin Worth Rs 50 Crores Recovered - Sakshi

8 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

కశ్మీర్‌: జమ్మూ కశ్మీర్‌ పోలీసులు సోమవారం పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన నార్కో-టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించారు. ఓ ఉగ్రవాదిని అరెస్టు చేయడమే కాక, కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. 8 కిలోల హెరాయిన్ తీసుకెళ్తున్న ఈ గ్రూప్‌ గురించి జమ్మూ కశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో కాపుగాసి మాటేసిన పోలీసులు ఈ గ్రూప్‌కు చెందిన ఒక వ్య‍క్తిని పట్టుకున్నారు. ఇతడిని మదాసిర్ అహ్మద్‌గా గుర్తించారు.

"ఈ గ్రూప్‌, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఈ గ్రూపు మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ లోయలో యాక్టీవ్‌గా ఉన్న ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తుంది. ఈ రికవరీలు మాదకద్రవ్యాల డీలర్లకు, ఉగ్రవాదులకు మధ్య పరస్పరం ఉన్న సంబంధాన్ని కూడా బహిర్గతం చేశాయి" అని కశ్మీర్‌ ఐజీ విజయ్ కుమార్‌ తెలిపారు.  ఈ గ్రూపు లోయలో ఉగ్రవాద కార్యకలాపాలపు బలోపేతం చేయడానికి పని చేస్తోంది. అంతేకాక స్థానిక యువకులను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపిస్తోంది అన్నారు ఐజీ విజయ్‌ కుమార్‌. ఇక పట్టుబడిన ఈ 8 కిలోగ్రామలు హెరాయిన్‌ మార్కెట్‌ విలువ 50 కోట్ల రూపాయల ఉంటుందని పోలీసులు తెలిపారు. 

ఈ మాదక ద్రవ్యాల రవాణాలో తో పాటు మరో వ్యక్తి కూడా పాల్గొన్నాడని.. కాని అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతడిని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: 8 మంది పాకిస్తానీలు.. 30 కేజీల హెరాయిన్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top