కలెక్టర్‌ పీఏను.. డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ | Hastinapuram Man Cheated By Saying Collector PA Over Double Bedroom House | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ పీఏను.. డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ

Mar 23 2021 12:49 PM | Updated on Mar 23 2021 12:50 PM

Hastinapuram Man Cheated By Saying Collector PA Over Double Bedroom House - Sakshi

మరో పది మంది ఇళ్లు వస్తాయనే ఆశతో 2016లో రూ.27 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు

హస్తినాపురం: తాను కలెక్టర్‌ పీఏగా పనిచేస్తున్నానని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి ఎంతో మందిని మోసం చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం హైకోర్టు కాలనీకి చెందిన ఎల్లంకి బ్రహ్మచారికి కొత్తపేట హుడా కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యా పారి సుబ్రమణ్యంతో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో తాను కలెక్టర్‌ పీఏగా పనిచేస్తున్నా నని, తాను డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని సుబ్రమణ్యం మాయమాటలతో బ్రహ్మచారిని నమ్మించాడు. దీంతో ఆయనతోపాటు మరో పది మంది ఇళ్లు వస్తాయనే ఆశతో 2016లో రూ.27 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితుడు బ్రహ్మచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు సుబ్రమణ్యం ఉంటున్న కొత్తపేట హుడా కాంప్లెక్స్‌కు వెళ్లిచూడగా అక్కడ నుంచి వెళ్లిపోయాడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement