Tamilnadu Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం

Fire Accident In Shankarapura Tamil Nadu - Sakshi

చెన్నై: తమిళనాడులోని కల్లకురిచి జిల్లా శంకరాపురంలో మంగళవారం ఒక బాణాసంచా దుకాణంలో పేలుళ్లు సంభవించి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. దీపావళిని పురస్కరించుకొని శంకరాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన దుకాణంలో ఆకస్మాత్తుగా టపాసులు పేలాయి.

దీంతో ఒక్కసారిగా దుకాణంలో భారీగా మం‍టలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలైన 10 మందిని కల్‌కర్చి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం తరలించారు.  వారి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబానికి 5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి లక్ష రూపాయలను స్టాలిన్ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. సహాయక చర్యలను కల్లకురిచి జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ జియవుద్దీన్‌లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. బాణసంచా షాప్ కు పక్కన ఉన్న దుకాణాలు కూడా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. 

చదవండి: Match Box: 14 ఏళ్ల తరువాత ధర డబుల్‌ ..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top