ఆమె ఇంట అతడు.. భర్తకు విషయం తెలిసి..   | Extra Marital Affair: Husband Brutally Kills His Wife And Lover In Karnataka | Sakshi
Sakshi News home page

ఆమె ఇంట అతడు.. భర్తకు విషయం తెలిసి..  

Dec 13 2021 6:48 AM | Updated on Dec 13 2021 6:49 AM

Extra Marital Affair: Husband Brutally Kills His Wife And Lover In Karnataka - Sakshi

హత్యకు గురైన కావ్య, నారాయణ స్వామి (ఫైల్‌)

సాక్షి, బొమ్మనహళ్లి(కర్ణాటక): గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షునితో పాటు మరో మహిళ హత్యకు గురయ్యారు. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని అనేకల్‌ తాలూకా చందాపురలోని రామయ్య లేఔట్‌లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. హతులను నారాయణస్వామి (42), కావ్య (32)గా గుర్తించారు. వీరిద్దరూ సమీపంలోని చిక్కహాగడె గ్రామానికి చెందినవారు.  

భర్తకు విషయం తెలిసి..  
నారాయణ స్వామి కావ్య ఇంటికి వచ్చి ఉండగా,  కావ్య భర్తకు ఈ విషయం తెలిసింది. ఆవేశం పట్టలేక ఇంటికి చేరుకొని ఇంటి ముందు నారాయణ స్వామిని, ఇంటిలో ఉన్న కావ్యను కత్తితో నరికి చంపి పరారయ్యాడు. అతనితో పాటు ఆటోలో వచ్చిన మరో ముగ్గురు కూడా ఈ హత్యాకాండలో పాల్గొన్నట్లు సూర్యనగర పోలీసులు తెలిపారు.

కావ్య తల్లి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా చేరుకుని పరిశీలించారు. పాత కక్షలా, లేక ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందా? అని ఆరా తీశారు. కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న భర్త, ఇతరుల కోసం గాలిస్తున్నారు.    

చదవండి: మందు కొట్టి.. ఫ్యామిలీని బలిపెట్టాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement