‘సార్‌..దయచేసి మా అమ్మను ఇంటికి పంపకండి.. జైలుకు పంపండి..’ | Drunken Lady hulchul in Hyderabad | Sakshi
Sakshi News home page

‘సార్‌..దయచేసి మా అమ్మను ఇంటికి పంపకండి.. జైలుకు పంపండి..’

Oct 14 2024 11:47 AM | Updated on Oct 14 2024 12:13 PM

Drunken Lady hulchul in Hyderabad

ఫిలింనగర్‌: మద్యం మత్తులో ఓ మహిళ (44) పార్కు పక్కన తూలిపోతూ..రోడ్డు పక్కన పడుకుని న్యూసెన్స్‌ చేస్తుండగా సమాచారం అందుకున్న ఫిలింనగర్‌ పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–12లోని సయ్యద్‌నగర్‌ బస్తీలో నివసించే ఓ మహిళ గత కొంతకాలంగా మద్యానికి బానిసై అర్ధరాత్రి దాకా రోడ్లపై తిరుగుతూ న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తుంది. 

శుక్రవారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–12లోని ఎన్‌బీటీనగర్‌ ప్రాంతంలో మద్యం మత్తులో న్యూసెన్స్‌ చేస్తుండగా బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడకు వెళ్లి ఆమె ఇంట్లో అప్పగించి వచ్చారు. అయితే ఇంట్లో చెప్పకుండానే ఆమె మళ్లీ అదే అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో బయటకు వచి్చంది. ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని లోటస్‌పాండ్‌ పార్కు వద్ద వివస్త్రగా పడి ఉంది. 

శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫిలింనగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమె గురించి ఆరా తీయగా సయ్యద్‌నగర్‌లో నివసిస్తుందని తెలిసింది. దీంతో ఆమె కూతురికి ఫోన్‌ చేయగా ‘సార్‌..దయచేసి మా అమ్మను ఇంటికి పంపకండి..జైలుకు పంపండి..’ అంటూ ఆమె ఇంట్లో చేసిన న్యూసెన్స్‌ను మొరపె ట్టుకుంది. 

ఆమె భర్త పెయింటర్‌గా పనిచేస్తుంటాడని, ముగ్గురు పిల్లలు ఉన్నారని, మద్యానికి బానిసై నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. గత నెల రోజుల నుంచి 10 మార్లు పోలీసులు ఆమెను ఇలా గే రోడ్లపై మద్యం మత్తులో తిరుగుతుండగా కు టుం బసభ్యులకు అప్పగించారు. ఫిలింనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement