అగ్ని ప్రమాదం ఘటన.. నిందితులకు రిమాండ్‌ | Court Remanded Three Persons In Vijayawada Fire Accident Case | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదం ఘటనలో నిందితులకు రిమాండ్‌

Aug 11 2020 1:36 PM | Updated on Aug 11 2020 2:22 PM

Court Remanded Three Persons In Vijayawada Fire Accident Case - Sakshi

సాక్షి, విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనలో అరెస్టయిన ముగ్గురు నిందితులను న్యాయమూర్తి ముందు పోలీసులు హజరు పరిచారు. ఆస్పత్రి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీవోవో) డాక్టర్‌ కొడాలి రాజగోపాలరావు, స్వర్ణ ప్యాలెస్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఇన్‌చార్జి, ఆస్పత్రి జీఎం డాక్టర్‌ కె.సుదర్శన్‌, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ కోఆర్డినేటింగ్‌ మేనేజర్‌ పల్లెపోతు వెంకటేశ్‌లకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను మచిలీపట్టణం స్పెషల్ సబ్ జైలుకు పోలీసులు తరలించారు. (నిలువెత్తు నిర్లక్ష్యం)

విజయవాడ రమేశ్‌ ఆస్పత్రి.. హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న ప్రైవేటు కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి కారణం యాజమాన్యం నిర్లక్ష్యం, కనీస భద్రతా చర్యలు లేకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. సోమవారం అధికారులు, పోలీసులతో కూడిన మూడు ప్రత్యేక బృందాలు స్వర్ణ ప్యాలెస్‌తో సహా రమేశ్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించాయి. నగరపాలక సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. భవన నిర్మాణం జరగకపోవడం, అధికంగా పేషెంట్లను చేర్చుకోవడం, రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేయడం, తదితర లోపాలను తనిఖీ బృందాలు గుర్తించాయి.

Advertisement
 
Advertisement
Advertisement