చూస్తుండగానే 4 లక్షలు హాంఫట్‌ | Bangalore: Thieves Steal 4 Lakhs Cash From Bank Near Bank | Sakshi
Sakshi News home page

చూస్తుండగానే 4 లక్షలు హాంఫట్‌

Jul 22 2021 1:33 PM | Updated on Jul 22 2021 2:21 PM

Bangalore: Thieves Steal 4 Lakhs Cash From Bank Near Bank - Sakshi

సాక్షి, దొడ్డబళ్లాపురం(బెంగళూరు): స్కూటర్‌ డిక్కీలో ఉన్న నగదును దుండగులు క్షణాల్లో చోరీ చేశారు. కోడిగుడ్ల వ్యాపారం చేసే దొడ్డపట్టణానికి చెందిన రమేశ్‌ బుధవారం కర్ణాటక బ్యాంకులో రూ.4 లక్షలు డ్రా చేసి స్కూటర్‌ డిక్కీలో పెట్టుకున్నాడు. కోర్టు రోడ్డులోని హీరోహోండా షోరూం ముందు స్కూటర్‌ నిలిపి టీస్టాల్‌లోకి వెళ్లాడు. అప్పటికే వెంటాడిన దుండగులు క్షణాల్లో నగదుతో బైక్‌పై ఉడాయించారు. రమేశ్‌తోపాటు స్థానికులు దుండగులను పట్టుకోవాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది. సీటీవీ కెమెరా పుటేజీ ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement