పదిహేను రోజుల నుంచి ఫోన్‌లో తిడుతున్న వ్యక్తి.. దీంతో.. | Atrocity Case Filled On Man For Using Abusing Words In Medak | Sakshi
Sakshi News home page

పదిహేను రోజుల నుంచి ఫోన్‌లో తిడుతున్న వ్యక్తి.. దీంతో..

May 6 2021 6:01 PM | Updated on May 6 2021 6:08 PM

Atrocity Case Filled On Man For Using Abusing Words In Medak - Sakshi

సాక్షి, నిజాంపేట(మెదక్‌): నిజాంపేట మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసిన్నట్లు బుదవారం స్థానిక ఎస్సై ప్రకాశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోన్‌లో తిడుతున్నాడు.

కాగా,  నిజాంపేట గ్రామానికి చెందిన ఉప సర్పంచ్‌ కోమ్మట బాబును గత పదిహేను రోజుల నుంచి గ్రామానికి చెందిన అబ్దుల్‌ పాషా అనే వ్యక్తి బాబుపై కులం పేరుతో వ్యక్తిగత కక్షతో ఫోన్‌ ద్వారా బాబును ఉద్దేశించి దూషిస్తూ, బూతులు తిట్టుతూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు ఇవ్వగా అబ్ధుల్‌ పాషాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement