గత వైఎస్సార్సీపీ పాలనలో రూ.2.50 కోట్లతో మండలంలో అభివృద్ధి పనులు చేశాం. తడుకుపేట–మునీశ్వరస్వామి ఆలయం వరకు రూ. 40 లక్షలతో రోడ్డు వేశాం. అలాగే ముదిపల్లె– నామా తీర్థం వరకు రూ.48.50 లక్షలతో రహదారి నిర్మించాం. వీటితో పాటు జగనన్న కాలనీలో రూ.7.50 లక్షలతో పైప్లైన్ ఏర్పాటు చేశాం. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తడుకుపేట బజారువీధిలో రూ.10 లక్షలతో కాలువ నిర్మాణం, అలాగే మధురికొండ ఎిస్టీ కాలనీలో రూ.10 లక్షలతో రోడ్డు పనులు పెండింగ్లో పెట్టారు. గుండ్రాజుకుప్పం దళితవాడలో రూ.3.50 లక్షలతో పైప్లైన్ పనులు, మరో రూ.3.50 లక్షలతో అసంపూర్తిగా అంగన్వాడీ భవన నిర్మాణ పనులు పెండింగ్లో ఉంది. – గాంధీ, జెడ్పీటీసీ సభ్యుడు, నగరి


