
రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
పూతలపట్టు (కాణిపాకం) : రైలు నుంచి జారి పడి ఓ యువకుడు శనివారం మృతి చెందాడు. వివరాలు ఇలా ..గంగాధర నెల్లూరు మండలానికి చెందిన ప్రవీణ్(21) అనే యువకుడు తిరుపతి నుంచి చిత్తూరు వస్తున్నారు. ఈ క్రమంలో పూతలపట్టు మండలం మృత్తిరేవులు గ్రామం వద్ద రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
దూదేకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గఫూర్
వెదురుకుప్పం : రాష్ట్ర నూర్ బాషా (దూదేకుల) ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మండలంలోని నల్లవెంగనపల్లె పంచాయతీ ఏపేరి గ్రామానికి చెందిన ఏఎంసీ మాజీ డైరెక్టర్ డీజీ గఫూర్ను ఎన్నుకున్నట్లు ఆ సంఘం నేతలు ప్రకటించారు. శుక్రవారం విజయవాడలో జరిగిన మైనారిటీ సమావేశంలో రాష్ట్ర దూదేకుల సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్సయ్యద్బాజీ నేతృత్వంలో ఎన్నకున్నట్లు తెలిపారు.