
పలమనేరులో విజృంభిస్తున్న బ్లేడ్బ్యాచ్లు
పలమనేరు: పట్టణంలో వైఎస్సార్సీపీ నాయకుల బ్యానర్లను గుర్తుతెలియని బ్లేడ్ బ్యాచ్ రాత్రిపూట కోసేస్తోంది. ఇంతకూ ఎవరు వీటిని కట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. పట్టణంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల బ్యానర్లున్నప్పటికీ కేవలం వైఎస్సార్సీపీ నాయకుల బ్యానర్లనే ఈ బ్యాచ్ టార్గెట్ చేస్తోంది. నాయకుల పుట్టినరోజు, లేదా అభినందనలు ఇలా ఏ బ్యానర్ పట్టణంలో ఏర్పాటు చేసిన తొలిరోజే బ్లేడ్ గాట్లు తప్పడంలేదు. గత కొన్నాళ్లుగా ఈ తంతు పట్టణంలో సాగుతోంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ యువనేత క్యూడీ ఎస్ రాజేష్ బ్యానర్లను వీరు టార్గెట్ చేసి మరీ కోసేస్తున్నారు. దీనిపై సీసీ కెమెరాల ద్వారా నైనా స్థానిక పోలీసులు ఈ బ్లేడ్బ్యాచ్ను గుర్తించి, శిక్షించాలని బాధిత నాయకులు కోరుతున్నారు.
వైఎస్సార్సీపీ బ్యానర్లే వారి టార్గెట్