
వాహనం ఢీకొని జింక మృతి
బంగారుపాళెం : మండలంలోని నలగాంపల్లె వద్ద బుధవారం రాత్రి చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి జాతీయ రహదారిని దాటే క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో జింక తీవ్రంగా గాయపడి మృతి చెందింది. స్థానికులు జింక మృతి సమాచారాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన జింకను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన తరువాత కాల్చివేయనున్నట్లు తెలిపారు.