ఇంధనం గుట్టు..పట్టేదెట్టా? | - | Sakshi
Sakshi News home page

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?

Mar 25 2025 1:34 AM | Updated on Mar 25 2025 1:31 AM

పెట్రోల్‌ నాణ్యత.. కొలతల్లో తేడా.. కల్తీ తది తర కారణాలతో వినియోగదారులు మోసపోతున్నారు.

మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025

వేసవి ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఒక వైపు ఎండ తీవ్రత, మరోవైపు వేడి గాలుల దాటికి నీరు ఆవిరవుతోంది. గత ఏడాది వర్షపాతం అంతంత మాత్రంగానే నమోదు కావడం..దానికి తోడు చెరువులు, కుంటల్లో జలా లు కూడా లేకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. జిల్లాలోని పలు మండలాల్లో రోజు రోజుకు భూగర్భజలమట్టం పాతాళంలోకి చేరుతోంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా జిల్లాలో తాగు, సాగునీటికి సమస్యలు ఏర్పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. జిల్లాలో 2024 నుంచి ఈ ఏడాది మార్చి వరకు సాధారణ వర్షపాతం 1099.96 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అయితే పలు గ్రామాల్లో వేసవి ప్రారంభంలోనే నీటి ఎద్దడి సమస్యలు తలెత్తుతున్నట్లు రైతులు వాపోతున్నారు. కరెంట్‌ కోతలతో పాటు సాగునీటి వనరులు అడుగంటిపోవడంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. వేసవి ప్రారంభంలోనే బోరుబావులు, చెరువులు, కుంటలు, వాగుల్లో జలధారాలు అడుగంటుక పోవడంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.

ప్రాజెక్టుల్లోనూ తగ్గుతోంది

చిత్తూరు జిల్లాలోని కృష్ణాపురం ప్రాజెక్ట్‌ నీటి సా మర్థ్యం 0.2 టీఎంసీకాగా ప్రస్తుతం 0.13 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఎన్టీఆర్‌ జలాశయం నీటి సామర్థ్యం 0.12 టీఎంసీలు కాగా 0.1 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. అలాగే కృష్ణాపురం ప్రాజెక్ట్‌లో 689.13, ఎన్టీఆర్‌ జలాశయంలో 965.14 అడుగుల లోతులో నీటి నిల్వలున్నట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎండలు మండుతుండడంతో ఈ నీళ్లు ఎన్ని రోజులకు సరిపోతాయన్న ప్రశ్న జిల్లా ప్రజల్లో తలెత్తుతోంది.

వేసవి ప్రారంభంలోనే కష్టాలు

వేసవి ప్రారంభంలోనే నీటి కష్టాలు త ప్పడం లేదు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఇప్పటికి చాలా గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే కొన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా కాక పోవడంతో ప్రజలు వ్యవసాయ బావులు, బోరు బావులపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు, గంగవరం, వి.కోట, కుప్పం నియోజకవర్గం గుడుపల్లి, రామకుప్పం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో కిలోమీటర్ల మేర ఖాళీ నడకన వెళ్లి నీటిని తెచ్చుకునే పరిస్థితులు నెలకొన్నాయి. మారుమూల గ్రామా లకు పైపులైనన్‌ వేసినప్పటికీ నీటి కనెక్షన్‌ ఇచ్చే పనులు పూర్తి చేయకపోవడం, చిన్నపాటి మరమ్మతులు చేయకపోవడంతో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. చెరువులు, కుంటలు, వాగులపై ఆ ధారపడి సాగు చేసినా.. అడుగంటిపోవడంతో వరి, ఇతర పంటలు ఎండుముఖం పట్టే పరిస్థితి తలెత్తుతోంది. ప్రత్యామ్నాయ మార్గం లేక చేతికి వచ్చిన పంటను వదిలించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశుగ్రాసం కొరతతో పాటు నీటిఎద్దడి ఏర్పడడంతో పశువులు అల్లాడుతున్నాయి.

జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి ఇదీ..

జిల్లాలో తాజాగా జిల్లా భూగర్బ జలవనరుల శాఖ ఫిబ్రవరి నెలలో సేకరించిన వివరాల ప్రకారం.. జిల్లాలో సగటు లోతు 11.05 మీటర్లుగా నమోదైంది. జిల్లాలోని కుప్పం నియోజకవర్గం గుడుపల్లిలో 51.73 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అలాగే గంగవరంలో 12.53, కుప్పంలో 17.59, పలమనేరులో 11.98, పుంగనూరులో 12. 92, రామకుప్పంలో 16.71, శాంతిపురంలో 14.11, వి.కోటలో 22.18 మీటర్లతో అత్యధికంగా లోతుల్లోకి భూగర్భజలాలు పడిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మీటర్ల లోతుల్లోకి నీటిమట్టం పడిపోయింది. 2024వ సంవత్సరం ఫిబ్రవరి లో జిల్లాలోని అన్ని మండలాల్లో నీటి మట్టం 10.56 ఉండగా అదే ఈ ఏడాది ఫిబ్రవరి లో 11.05 కి పడిపోయింది.

పది పరీక్షలకు 214 మంది గైర్హాజరు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా సోమ వారం నిర్వహించిన పదో తరగతి గణితం పబ్లిక్‌ పరీక్షకు 214 మంది గైర్హాజరయ్యారని డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా లోని 118 పరీక్ష కేంద్రాల్లో రెగ్యులర్‌, ప్రైవేట్‌ విద్యార్థులు 21,080 మంది హాజరుకావాల్సి ఉండగా 20,866 మంది హాజరయ్యారన్నారు. 214 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. డీఈఓ 2, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 15 మంది, 18 కేంద్రాలను, సిట్టింగ్‌ స్క్వాడ్‌లు 65 పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వహించారని డీఈఓ తెలిపారు.

జెడ్పీలో కారుణ్య నియామకాలు

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాపరిషత్‌ పరిధిలో పలువురికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో చైర్మన్‌ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్‌నాయుడు సంబంధిత పత్రాలను అందజేశారు. మొత్తం ఏడుగురికి జూనియర్‌ సహాయకులుగా బాధ్యతలు అప్పగించారు. వీరు త్వరలో విధుల్లో చేరనున్నారు. జిల్లాలో కారుణ్య నియమాకాల కింద ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

విచారించి.. న్యాయం చేయండి

చిత్తూరు అర్బన్‌: ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదు, సమస్యపై క్షేత్రస్థాయిలో విచారించి, న్యాయం చేయాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ అధికారులను ఆదేశించారు. చిత్తూరు నగరంలోని ఏఆర్‌ పోలీసు కార్యాలయంలో సోమ వారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై ఆయా పోలీస్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్లతో వీడియో సమావేశంలో మాట్లాడి, సూచనలు చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు..కుటుంబ తగాదా లు, ఆర్థిక అంశాలు, మోసాలు, వేధింపులు, భూ తగాదాలకు సంబంధించిన 45 ఫిర్యాదు లు ఎస్పీకి అందజేశారు. ఈ గ్రీవెన్స్‌లో ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, డీటీసీ డీఎస్పీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సఫ్ల్లయ్‌ చానళ్లను పూడ్చేస్తున్నారు!

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలోని పలు సమస్యలపై సోమవారం జెడ్పీలో చైర్మన్‌ శ్రీనివాసులుకు ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు విన్నవించారు. ఇందులో భాగంగా వి.కోట మండలం మీదుగా బెంగళూరు–చైన్నె ఎక్స్‌ప్రెస్‌ హైవే రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా వి.కోట, పైపల్లి, పట్రపల్లి చెరువులకు వర్షపునీరు వచ్చే సఫ్లయి చానళ్లను ఎక్స్‌ప్రెస్‌ హైవే అధికారులు పూడ్చేస్తున్నారని మొరపెట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రం ఎగువ ప్రాంతాల్లో చెరువులు నిండినా, వర్షాలు కురిసినప్పుడు మొరవ ద్వారా వి.కోట, పైపల్లి, పట్రపల్లి చెరువులకు నీరు చేరుతుందన్నారు. ఈ నీటి ద్వారానే ఈ మూడు గ్రామాల ప్రజలకు సాగు, తాగునీరు అందుతోందన్నారు. అయితే ఎక్స్‌ప్రెస్‌ హైవే అధికారులు కాలువను పూడ్చి దానిపైన రోడ్డు వేస్తున్నారని ఆరోపించారు. అనంతరం మీడియాకు సమస్యను తెలిపారు. చిత్తూరు రూరల్‌ మండలంలో బోరు, పంపుసెట్‌ మంజూరు చేయాలని జెడ్పీటీసీ బాబునాయుడు విన్నవించారు. తుమ్మింద పంచాయతీ అడవిచేనులోని మర్రిమాను ఇండ్లు వద్ద 30 కుటుంబాలు ఉన్నాయన్నారు. వీరు నీటి సదుపాయం లేక అవస్థ పడుతున్నారని చెప్పారు. వ్యవసాయబావిలో నీరు తెచ్చుకుని అవస్థలు పడుతున్నారన్నారు. నీటి సమస్యను పరిష్కరించి కొత్త బోరు, పంపుసెట్‌ మంజూరు చేయాలన్నారు. సఫ్లయ్‌చానళ్ల సమస్యను కలెక్టర్‌కు నేరుగా కలిసి తెలియజేస్తానని చైర్మన్‌ తెలిపారు. నీటి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశిస్తామని వివరించారు.

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

జిల్లాలో ముంచుకొస్తున్న జలముప్పు

జిల్లాలో వేగంగా అడుగంటుతున్న భూగర్భజలాలు

ఎండిపోతున్న చెరువులు, బావులు, కుంటలు

యంత్రాంగం అప్రమత్తత అవసరం

భూమాతకు గర్భశోకం వచ్చింది. ఈ ఏడు భానుడి ప్రతాపంతో ఆ తల్లి కడుపులో దాచుకున్న జలమట్టం రోజురోజుకూ దారుణంగా పడిపోతోంది. వెరసి.. కుంటలు, చెరువులు, బావులు, బోరు బావుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. భూతలం మొత్తం ఎడారిని తలపిస్తోంది. ఫలితం జిల్లాలో కన్నీటి గడియలు మంచుకొస్తున్నాయి. నీటి కోసం జనం నీరసించిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. వేసవి ప్రారంభంలోనే జిల్లాకు దుర్భిక్షం పరిచయం అయ్యింది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే నీటి కోసం చుక్కలు చూడాల్సి వస్తోంది.

– చిత్తూరు కలెక్టరేట్‌

అత్యధిక నీటిమట్టం పడిపోయిన మండలాలు మండలం పడిపోయిన లోతు(మీటర్లు) గుడుపల్లి: 51.73

వి.కోట: 22.18

కుప్పం: 17.59

రామకుప్పం: 16.71

శాంతిపురం: 14.11

పుంగనూరు: 12.92

గంగవరం: 12.53

పలమనేరు: 11.98

జిల్లాలో నీటి వనరుల

సమాచారం

కాలువలు: 244

చెరువులు: 4,067

బావులు: 88,650

పెద్ద చెరువులు: 658

బోరుబావులు: 5,456

మొత్తం: 99,075

ఈ మండలాల్లో ఉపశమనం

జిల్లాలోని చౌడేపల్లిలో 1.72 మీ టర్లు, నగరిలో 2.16, ఎస్‌ఆర్‌ పు రంలో 3.54, తవణంపల్లెలో 1.99, వెదురుకుప్పంలో 3.71, పూతలపట్టు 2.94, కార్వేటినగరంలో 3.86 మీటర్ల లోతుల్లోనే భూగర్భజలాలు అందుబాటులో ఉండడంతో అక్కడి ప్రజలకు ఉపశమనం కలిగింది. వేసవి ప్రారంభంలోనే భూగర్భజలాలు పడి పోతుండగా, ఏప్రిల్‌, మే నాటికి పరిస్థితి మరింత దిగజారవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.

11.05 మీటర్లకు పడిన సగటు నీటిమట్టం

జిల్లాలో రోజురోజుకు నీటిమట్టం పడిపోతోంది. ఫిబ్రవరి చివరి నాటికి జిల్లా సగటు భూగర్భ జలమట్టం 11.05 మీటర్లకు పడిపోయినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. జిల్లాలోని గుడుపల్లి, రామకుప్పం, వి.కోట, గంగవరం మండలాల్లో నీటిమట్టం అత్యధిక లోతుకు పడిపోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాలో 38 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అన్నదాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే ఏప్రిల్‌, మే నెలల్లో భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉంటుందోనని అన్నదాతలు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

నీటి సంరక్షణ అందరి బాధ్యత

నీటి సంరక్షణ ప్రతి ఒ క్కరూ బాధ్యతగా భా వించాలి. నీటిని జాగ్రత్త గా వాడుకోవాలి. అప్పు డే భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయవ చ్చు. పశ్చిమ మండలాల్లో కొద్దిగా నీటి సమస్య ఇబ్బందిగానే ఉంది. తాగునీటి సమస్యలున్న గ్రామాల్లో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలి. భూగర్భజలాలను వృథా చేయకుండా వాడుకోవాలి. అర్బన్‌ ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గిపోతున్నాయి. కొత్త భవనాల్లో రీచార్జి బిట్‌ల ను కచ్చితంగా కట్టాలనే ప్రభుత్వ నిబంధన ఉంది. అయితే చాలా చోట్ల ఆ నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. పొలాల్లో నీటి గుంటలు, కందకాలను ఏర్పాటు చేసుకోవాలి.

– గోవర్ధన్‌రెడ్డి, జిల్లా భూగర్భ జలశాఖ అధికారి

ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి

నగరం, పరిసర ప్రాంతాల్లో జనాభా పెరగడంతో భూగర్భ జలాల వినియోగం పెరిగింది. వర్షాలు అంతగా లేకపోవడంతో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగింది. దీంతో కొన్నిచోట్ల బాగా అడుగంటిపోయాయి. నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి ఇళ్లు, అపార్టుమెంట్‌ ఆవరణలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయాలి. నీటి రీసైక్లింగ్‌ విధానం అమలు చేయాలి. నగర పరిసరాల్లో కొండలు చుట్టూ కందకాలు తవ్వాలి. డబ్బు మాదిరిగానే నీటి వినియోగంలో అంతే పొదుపు, జాగ్రత్తలు పాటించాలి.

– రవికుమార్‌నాయుడు, జెడ్పీ సీఈఓ, చిత్తూరు జిల్లా

భూగర్భ జలమట్టం పడిపోయిన మండలాల వివరాలివీ..

10 నుంచి 20 మీటర్ల లోపు నీటిమట్టం పడిపోయిన మండలాలు: 8

20 నుంచి 30 మీటర్ల లోతుకు పడిపోయినవి: 2

5 నుంచి 10 మీటర్ల లోతుకు పడిపోయినవి: 8

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?
1
1/8

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?
2
2/8

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?
3
3/8

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?
4
4/8

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?
5
5/8

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?
6
6/8

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?
7
7/8

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?
8
8/8

ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement