చిత్తూరు అర్బన్ : చిత్తూరులోని ఎకై ్సజ్ అండ్ ప్రొహిభిషన్ (ఆబ్కారీ) శాఖకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ను ఎస్పీ మణికంఠ శనివారం పరిశీలించారు. నకిలీ మద్యం, మాదక ద్రవ్యాల విశ్లేషణ విధానాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడున్న యంత్ర పరికరాల కచితత్వాన్ని, వెలువరించే నివేదికలపై అధికారులతో మాట్లాడారు. అనంతరం మత్తు పదార్థాల బారిన పడ్డ వారిని, బయటపడేసే డీ–అడిక్షన్ సెంటర్ను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎకై ్సజ్, పోలీసు శాఖ సంయుక్తంగా పనిచేసి అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలను నివారించాల్సి ఉందన్నారు. ఇందు కోసం ప్రణాళికతో ముందుకు వెళతామన్నారు. ఎస్పీ వెంట సీఐలు జయరామయ్య, నెట్టికంటయ్య, నిత్యబాబు ఉన్నారు.