గుడిపాల: ఓ పంచాయతీ కార్యదర్శిని గుడిపాల మండలం నుంచి పాలసముద్రం మండలానికి జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ గత ఫిబ్రవరి 25వ తేదీన బదిలీ చేశారు. అయితే కలెక్టర్ ఉత్తర్వులను ఆ పంచాయతీ కార్యదర్శి ఏ మాత్రం లెక్కచేయలేదు. వెంటనే తనకు ఉన్న పలుకుబడితో తెలుగుదేశం నాయకుల వద్ద నుంచి అధికారులకు ఫోన్ల ద్వారా ఒత్తిడి తెప్పించారు. దీంతో అధికారులు కూడా అతన్ని రిలీవ్ చేయకుండా పెండింగ్లో పెట్టేశారు. వివరాలులోకి వెళితే.. 189 కొత్తపల్లె పంచాయతీకి పంచాయతీ కార్యదర్శిగా మోహన్ (గేడ్–3) పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా అతనిపై ఆరోపణలు రావడంతో అతన్ని పాలసముద్రం మండలం ఆముదాల పంచాయతీకి కార్యదర్శిగా బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ గత ఫిబ్రవరి 25వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కలెక్టర్ ఆదేశాలను ఏ మాత్రం లెక్క చేయకుండా టీడీపీ నాయకుల వద్ద నుంచి అధికారులకు ఫోన్లు చేయించి రిలీవ్ చేయకుండా నిలిపివేశారు. కలెక్టర్ ఆదేశాలను కూడా పట్టించుకోరా? అంటూ పలువురు గుసగుసలాడుతున్నారు.
కలెక్టర్ ఆదేశాలు భేఖాతర్