4న కాణిపాకంలో పలు ప్రారంభోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

4న కాణిపాకంలో పలు ప్రారంభోత్సవాలు

Mar 2 2024 12:15 PM | Updated on Mar 2 2024 12:15 PM

మాట్లాడుతున్న మోహన్‌ రెడ్డి, వెంకటేశు   - Sakshi

మాట్లాడుతున్న మోహన్‌ రెడ్డి, వెంకటేశు

కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 4వ తేదీన పలు భవనాలకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈఓ వెంకటేశు తెలిపారు. శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ సుమారు రూ.60 కోట్లతో నిర్మించిన పలు భవనాలను సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మంత్రులు మంత్రి కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు, కలెక్టర్‌ షణ్మోహన్‌ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే వరసిద్ధుని ఆలయంలో రూ.8.5 కోట్లతో బంగారుతాపడం పనులు ప్రారంభించామన్నారు. ఇప్పటికే రూ.3.5 కోట్లతో మూషిక మండపంలో వెండి వాకిలికి సిద్ధం చేసినట్లు వివరించారు. ఇందుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో అర్చకుడు శేఖర్‌ గురుకుల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement