వడ్డీ రేట్ల కోతపై ఆశలు | will rbi cut the repo rate again | Sakshi
Sakshi News home page

వడ్డీ రేట్ల కోతపై ఆశలు

Apr 7 2025 1:09 PM | Updated on Apr 7 2025 3:28 PM

will rbi cut the repo rate again

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన నేడు(7న) ప్రారంభంకానున్న మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) పరపతి సమీక్షా సమావేశాల తుది నిర్ణయాలు బుధవారం(9న) వెలువడనున్నాయి. గత పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 0.25 శాతం తగ్గించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజా సమావేశంలో మరో పావు శాతం కోతకు వీలున్నట్లు కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాగా.. 9వ తేదీనే యూఎస్‌ ఫెడ్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) గత పాలసీ వివరాల మినిట్స్‌ విడుదలకానున్నాయి. ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లను 4.25–4.5 శాతంవద్ద యథాతథంగా కొనసాగించేందుకే కట్టుబడింది. 10న మార్చి నెలకు యూఎస్, చైనా కన్జూమర్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలకానున్నాయి. ఇక వారాంతాన(11న) దేశీయంగా ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), మార్చి రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. జనవరిలో ఐఐపీ 5 శాతం పుంజుకోగా.. ఫిబ్రవరిలో సీపీఐ 3.62 శాతంగా నమోదైంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తన మూడు రోజుల సమావేశంలో రెపో రేటు 25 బేసిస్ పాయింట్ల (బీపీఎస్‌) తగ్గింపును ప్రకటించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సానుకూల స్థూల ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక సవాళ్ల మధ్య రెపో రేటును ప్రస్తుత 6.25 శాతం నుంచి 6.00 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. దేశీయ వృద్ధికి ఊతమిస్తూనే భారత ఆర్థిక వ్యవస్థను బాహ్య ఒత్తిళ్ల నుంచి కాపాడేందుకు ఈ చర్య వ్యూహాత్మకంగా పని చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు కోత ఎందుకు?

దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల కారణంగా  ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. దేశీయంగా వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్వారా కొలిచే భారత రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. శీతాకాల పంటల రాకతో ఆహార ధరలు తగ్గడం వల్ల 2025 ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 4.3 శాతం నుంచి ఏడు నెలల కనిష్ఠ స్థాయి 3.6 శాతానికి పడిపోయింది. ఇది మోడరేషన్ ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ లక్ష్య పరిధి 2-6% పరిధిలో ఉంచుతుంది. ద్రవ్యోల్బణ నియంత్రణ కంటే ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఎంపీసీకి ఈ గణాంకాలు అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇదీ చదవండి: ష్‌.. ఈ విషయాలు ఎవరికీ చెప్పకండి!

సుంకాల ప్రభావం..

అమెరికా ముఖచిత్రం మార్చేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పరస్పర సుంకాలు విధించడం ప్రపంచ వాణిజ్యం మందగమనంపై ఆందోళనలను రేకెత్తిస్తుంది. కీలక ఎగుమతిదారు అయిన భారత్‌కు ఈ సుంకాలు బాహ్య డిమాండ్‌ను తగ్గిస్తాయి. ఇవి ఆర్థిక వృద్ధిపై ఒత్తిడిని పెంచుతాయి. ఈ పతనాన్ని ఎదుర్కోవడానికి, దేశీయ వినియోగం, పెట్టుబడులు బలంగా ఉండేలా చూసేందుకు ఆర్‌బీఐ రేట్ల కోత ముందస్తు చర్యగా భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement