
18 నుంచి అమ్మకాలు ప్రారంభం
వివో సంస్థ టీ4 అల్ట్రా పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఇందులో సోనీ ఐఎంఎక్స్ 921 50 మెగాపిక్సల్స్ రియర్ కెమెరా సెన్సార్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. మొత్తంగా వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. 100 ఎక్స్ హైపర్జూమ్ ఫీచర్ కూడా ఉంది. ఫోనిక్స్ గోల్డ్, మెటీరియర్ గ్రే రంగుల్లో ఇది లభించనుందని వివో పేర్కొంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్తో ఉండే ఈ ఫోన్ 8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.37,999.
12జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.39,999.
12జీబీ, 512జీ వేరియంట్ ధర రూ.41,999గా కంపెనీ ప్రకటించింది.
ఇదీ చదవండి: చమురు సలసల.. రూపాయి డీలా
ఫ్లిప్కార్ట్తోపాటు వివో ఇండియా ఈ స్టోర్లో ఈ నెల 18 నుంచి అమ్మకాలు మొదలవుతాయని తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై ఫ్లాట్ రూ.3,000 డిస్కౌంట్ను ప్రకటించింది. రూ.5,000 ఎక్స్ఛేంజ్ బోనస్తోపాటు, 9 నెలల నోకాస్ట్ ఈఎంఐ సదుపాయలను కూడా ఆఫర్ చేస్తోంది.