మార్కెట్‌లో అ‍‍స్థిరత.. చివరకు లాభాలతో ముగింపు | Today Share Market Updates | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో అ‍‍స్థిరత.. చివరకు లాభాలతో ముగింపు

Aug 9 2021 3:45 PM | Updated on Aug 9 2021 4:00 PM

Today Share Market Updates - Sakshi

ముంబై: ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం నుంచే దేశీ సూచీలు లాభాల బాటలో పయణించాయి. మధ్యలో కొంత వరకు ఊగిసలాడినా చివరకు లాభాలతోనే ఈ రోజు మార్కెట్‌ ముగిసింది. 

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఈ రోజు ఉదయం 54,385 పాయింట్ల వద్ద ట్రేడ్‌ మొదలైంది. మొదటి గంటలోనే దాదాపు 250 పాయింట్లు లాభపడింది. ఓ దశలో గరిష్టంగా  54,584 పాయింట్లను టచ్‌ చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలుపెట్టడంతో మళ్లీ పాయింట్లు కోల్పోవడం మొదలైంది. మార్కెట్‌ ముగిసే సమయానికి 125 పాయింట్ల లాభంతో 54,402 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ ఈ రోజంతా ఒడిదుడుకులకు లోనైంది. మార్కెట్‌ ప్రారంభమైన తర్వాత లాభాల బాటలో పయణిస్తూ ఓ దశలో గరిష్టంగా 16,320 పాయింట్లను టచ్‌ చేసింది. ఆ తర్వాత నష్టపోతూ కనిష్టంగా 16,203 పాయింట్లను తాకింది. మరికొద్ది సేపట్లో మార్కెట్‌ ముగుస్తుందనగా కోలుకుని 20 పాయింట్ల లాభంతో 16,258 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement