బెంగళూరు: ఐఫోన్ల దిగ్గజం యాపిల్ దేశీయంగా విస్తరణను చేపట్టనుంది. ఇందుకు భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ ప్రొడక్ట్ కార్యకలాపాల వైస్ప్రెసిడెంట్ ప్రియ బాలసుబ్రమణ్యన్ పేర్కొన్నారు. ఉద్యోగులు, యాప్స్, సరఫరా భాగస్వాములు, తదితరుల ద్వారా 10 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి మద్దతివ్వనున్నట్లు 2021 బెంగళూరు టెక్ సదస్సు సందర్భంగా తెలియజేశారు. రెండు దశాబ్దాలుగా యాపిల్ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. 2017లో బెంగళూరు యూనిట్లో ఐఫోన్ల తయారీని చేపట్టినట్లు ప్రస్తావించారు. ఆపై చెన్నైలోనూ తయారీ కార్యకలాపాలను విస్తరించినట్లు పేర్కొన్నారు. తద్వారా వివిధ ఐఫోన్ మోడళ్లను దేశ, విదేశీ మార్కెట్ల కోసం రూపొందిస్తున్నట్లు వివరించారు. కస్టమర్లను ఈ మోడళ్లు ఆకర్షి స్తాయన్న విశ్వాసాన్ని వక్తం చేశారు.
ఐపీవోలపై ఆచితూచి..: నజారీ టెక్నాలజీస్
పబ్లిక్ ఇష్యూకి వెళ్లడం ద్వారా నిధులను సమీకరించాలంటే కంపెనీలు సాధ్యాసాధ్యాల పరిశీలనకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని స్టార్టప్లకు ఐపీవో అవకాశాలు, సవాళ్లుపై నిర్వహించిన టెక్ సదస్సులో నజారా టెక్నాలజీస్ సీఈవో మనీష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇందుకు కంపెనీ నిర్వహణ తదితర పలు అంశాలపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలనలోకి ప్రవేశించవలసి ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రమోటర్లు వాటా విక్రయం ద్వారా వాటాదారులకు విలువ చేకూర్చడం అనేది కాల్పనిక అంశమని అన్నారు.
చదవండి: యాపిల్ బంపర్ ఆఫర్..! ఇకపై మీఫోన్లను మీరే బాగు చేసుకోవచ్చు..!
దేశీయంగా యాపిల్ విస్తరణ.. 10 లక్షల ఉద్యోగాలు టార్గెట్
Published Fri, Nov 19 2021 12:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement