India Tata Power Says Hit By Cyber Attack, Critical Systems Functioning Normally - Sakshi
Sakshi News home page

టాటా కంపెనీపై సైబర్‌ దాడి కలకలం

Oct 15 2022 7:25 AM | Updated on Oct 15 2022 12:02 PM

Tata Power Says Hit By Cyber Attack - Sakshi

న్యూఢిల్లీ: విద్యుత్‌ రంగ సంస్థ టాటా పవర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) మౌలిక సదుపాయాలు .. సైబర్‌ దాడికి గురయ్యాయి. దీంతో కొన్ని ఐటీ సిస్టమ్స్‌పై ప్రభావం పడిందని స్టాక్‌ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది.

సిస్టమ్స్‌ను పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించింది. కీలకమైన అన్ని సిస్టమ్‌లు యథాప్రకారం పని చేస్తున్నాయని, అయితే ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగులు, కస్టమర్లు వినియోగించే పోర్టల్స్, టచ్‌ పాయింట్లపై కొన్ని పరిమితులు అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement