-
బుల్ జోష్: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు
ఈ వారంలో జరిగే నాలుగు రోజుల ట్రేడింగ్లో బడ్జెట్పై అంచనాలు, కార్పొరేట్ క్యూ3 ఫలితాలు, నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ, ప్రపంచ పరిణామాలతో ఇన్వెస్టర్ల అప్రమత్తతో ఒడిదుడుకుల ట్రేడింగ్కు అవకాశం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో సోమవారం ఉదయం 9.46 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 413 పాయింట్ల లాభంతో 61035 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 110 పాయింట్లు లాభ పడి 18138 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. ఆల్ట్రాటెక్ సిమెంట్,ఎన్టీపీసీ,జేఎస్డబ్ల్యూ స్టీల్,అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రసిం,టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా..హీరోమోటో కార్ప్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యూపీఎల్, టాటా మోటార్స్, హిందాల్కో, కొటక్ మహీంద్రా, ఎథేర్ మోటార్స్,ఎస్బీఐ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అంతకు ముందు ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 288 పాయింట్లు లాభంతో 60909 వద్ద, నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 18106 ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇక 1620 షేర్లు అడ్వాన్స్గా ట్రేడ్ అవుతుండగా.. 616 షేర్లు నష్టాల్లో నష్టాలతో ఆరంభించాయి. 143 షేర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. -
సూచీలకు మాంద్యం భయం
ముంబై: ఆర్థిక మాంద్యం భయాలతో దేశీయ స్టాక్ సూచీల రెండురోజుల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. కేంద్ర బడ్జెట్, రానున్న ప్రధాన కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వ్యవహరించారు. ఆటో, విద్యుత్, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సెన్సెక్స్ 187 పాయింట్లు నష్టపోయి 60,858 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 58 పాయింట్లు పతనమై 17,108 వద్ద నిలిచింది. అయితే ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఐటీ రంగ షేర్లకు స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్లో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ లాభ, నష్టాల మధ్య కదలాడాయి. సెన్సెక్స్ 60,716 వద్ద కనిష్టాన్ని, 61,032 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 18,064 – 18,155 పరిధిలో కదలాడింది. అమెరికా తయారీ రంగ, రిటైల్ అమ్మకాలు మెప్పించకపోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ►డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఏషియన్ పెయింట్స్ షేరు 3% నష్టపోయి రూ.2,868 వద్ద స్థిరపడింది. ► ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీఓ) ప్రకటన తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుంది. బీఎస్ఈలో నాలుగుశాతం క్షీణించి రెండు నెలల కనిష్ట స్థాయి రూ.3462 వద్ద స్థిరపడింది. ►బలమైన ఆదాయాల వృద్ధి నమోదు ఆశలతో ఓఎన్జీసీ షేరు రెండు శాతం పెరిగి ఆరు నెలల గరిష్టం రూ.152 వద్ద స్థిరపడింది. -
క్రిస్మస్ తర్వాత శాంటాక్లాజ్ ర్యాలీ
ముంబై: క్రిస్మస్ పండుగ తర్వాత రోజు స్టాక్ మార్కెట్లో శాంటాక్లాజ్ ర్యాలీ కనిపించింది. కోవిడ్ భయాలతో గతవారం అమ్మకాల ఒత్తిడికి లోనైన దేశీయ మార్కెట్ సోమవారం భారీ లాభాలను ఆర్జించింది. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు డిమాండ్ లభించింది. అధిక వెయిటేజీ ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ షేర్లు ఒకటిన్నర శాతం రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు ట్రేడింగ్పై పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఉదయం సెన్సెక్స్ 90 పాయింట్ల స్వల్ప నష్టంతో 59,845 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల పతనంతో 17,830 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయంగా ట్రేడింగ్ను ప్రభావితం చేసే ప్రతికూలాంశాలేవీ లేకపోవడంతో సూచీలు స్థిరంగా ముందుకు కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 989 పాయింట్లు దూసుకెళ్లి 60,834 వద్ద, నిఫ్టీ 277 పాయింట్లు బలపడి 18,084 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ఆఖర్లో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరికి సెన్సెక్స్ 721 పాయింట్ల లాభంతో 60,566 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 208 పాయింట్లు పెరిగి 18,015 వద్ద నిలిచింది. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో ఐదు మాత్రమే నష్టపోయాయి. దీంతో స్టాక్ సూచీల నాలుగురోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కాయి. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు రాణించాయి. ముఖ్యంగా ఫైనాన్స్, ఇంధన, ఐటీ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. విస్తృత స్థాయిలో మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లు భారీ డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్లు వరుసగా 3.13%, 2.31 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.498 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1286 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఆసియా అరశాతం చొప్పున లాభపడ్డాయి. డాలర్ మార్కెట్లో రూపాయి విలువ 17 పైసలు బలపడి 82.65 స్థాయి వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ ఒకశాతానికి పైగా ర్యాలీ చేయడంతో స్టాక్ మార్కెట్లో రూ. 5.79 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్ఈలోని కంపెనీల మొత్తం విలువ రూ.277.91 లక్షల కోట్లకు చేరింది. రాయ్ దంపతులు ఎన్డీటీవీలోని తమ వాటాను అదానీకి విక్రయించనుండటంతో 5% బలపడి రూ. 358 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన ఎన్డీటీవీ, చివరికి 1% లాభంతో రూ.343 వద్ద స్థిరపడింది. -
దేశంలో తగ్గని ఐపీవో జోరు..ఐపీవోకి సిద్దంగా దిగ్గజ కంపెనీలు
న్యూఢిల్లీ: తాజాగా రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ భారత్ హైవేస్ ఇన్విట్, వైట్ ఆయిల్స్ తయారీ కంపెనీ గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఈ జాబితాలో చేరాయి. ఈ రెండు సంస్థలూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. వివరాలు ఇలా.. రూ. 2,000 కోట్లకు రెడీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా భారత్ హైవేస్ ఇన్విట్ బుక్బిల్డింగ్ ద్వారా రూ. 2,000 కోట్ల విలువైన యూనిట్లను ఆఫర్ చేయనుంది. తద్వారా రూ. 2,000 కోట్లు సమకూర్చుకోనుంది. నిధులను ప్రాజెక్టŠస్ ఎస్పీవీకి చెందిన కొన్ని రుణాల చెల్లింపుతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎస్పీవీ ప్రాజెక్టŠస్లో.. పోర్బందర్– ద్వారకా ఎక్స్ప్రెస్వే, వారణాశి– సంగమ్ ఎక్స్ప్రెస్వే, జీఆర్ సంగ్లీ– సోలాపూర్ హైవే, జీఆర్ అక్కల్కోట్– సోలాపూర్ హైవే, జీఆర్ ఫగ్వారా ఎక్స్ప్రెస్వే, జీఆర్ గుండుగొలను– దేవరాపల్లి హైవే ఉన్నాయి. 2022 ఆగస్ట్లో ఏర్పాటైన భారత్ హైవేస్ ఇన్విట్ ప్రాజెక్ట్ ఎస్పీవీలో ప్రతీ ప్రాజక్టులోనూ 100 శాతం చొప్పున వాటా కొనుగోలు చేయనుంది. ప్రాథమికంగా 49 శాతం వాటాను సొంతం చేసుకుంటుంది. రూ. 500 కోట్లపై కన్ను పబ్లిక్ ఇష్యూలో భాగంగా గాంధార్ ఆయిల్ రిఫైనరీ రూ. 357 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 1.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ఎక్విప్మెంట్ కొనుగోలుసహా.. సిల్వస్సా ప్లాంటులో ఆటోమోటివ్ ఆయిల్ తయారీ సామర్థ్య విస్తరణకు అవసరమైన సివిల్ వర్క్లకూ వెచ్చించనుంది. అంతేకాకుండా తలోజా ప్లాంటులో పెట్రోలియం జెల్లీతోపాటు.. సంబంధిత కాస్మెటిక్ ప్రొడక్టుల తయారీ విస్తరణకు సైతం వినియోగించనుంది. వైట్ ఆయిల్స్ తయారీకి మరిన్ని బ్లెండింగ్ ట్యాంకులను సైతం ఏర్పాటు చేయనుంది. -
ఐపీవోకి రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్.. స్టాక్ ప్రైస్ ఎంతంటే?
న్యూఢిల్లీ: వారాంతాన(23న) ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూకి రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ రూ. 94–99 ధరల శ్రేణిని ఖరారు చేసింది. మంగళవారం(27న) ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 3,31,25,000 షేర్లను ప్రమోటర్ డేవిడ్ దేవసహాయంతోపాటు, పీఈ సంస్థ అసెంట్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఇండియా ఆఫర్ చేయనుంది. తద్వారా కంపెనీ రూ. 388 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. 2015లో అసెంట్ క్యాపిటల్ రేడియంట్లో 37.2 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. ప్రత్యేకంగా రూపొందిన రక్షణాత్మక వ్యాన్లను సొంతం చేసుకునేందుకు వెచ్చించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 150 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చెయ్యాలి. జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ రెడీ ఫిన్టెక్ కంపెనీ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 490 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 1.05 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు, ఇతర వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 2011లో ప్రారంభమైన కంపెనీ బిజినెస్ టు బిజనెస్ టు కస్టమర్ విభాగంలో పనిచేస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement