బీఎస్‌ఈతో తెలంగాణ ఒప్పందం | Telangana govt joins hands with BSE | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఈతో తెలంగాణ ఒప్పందం

Oct 20 2020 5:35 AM | Updated on Oct 20 2020 5:35 AM

Telangana govt joins hands with BSE - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్‌ఎంఈ) కంపెనీల వ్యాపారం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్లోబల్‌ లింకర్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా  స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌  బీఎస్‌ఈతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆర్థిక వనరుల లభ్యత, కంపెనీల విశ్వసనీయతను పెంచే కీలక సవాల్‌ను పరిష్కరించేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది. అలాగే లిస్టింగ్‌ ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి కంపెనీలకు అవగాహన కల్పించేందుకు బీఎస్‌ఈ సాయం చేస్తుంది. ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల లభ్యత ఎంఎస్‌ఎంఈలకు పరిమితంగా ఉంటోంది. ఇది కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటని బీఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిశ్‌ కుమార్‌ చౌహాన్‌ అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా విస్తరణ మొదలుకుని కొనుగోళ్ల స్థాయికి వ్యాపారం ఎదిగేందుకు ఎంఎస్‌ఎంఈలకు నిధుల సమీకరణకు తోడ్పాటు లభిస్తుందన్నారు. ప్రస్తు తం స్టాక్‌ ఎక్సే్ఛంజీల్లో రాష్ట్రానికి చెందిన కొన్ని ఎంఎస్‌ఎంఈలు మాత్రమే నమోదయ్యాయని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ తెలిపారు. ఈ సంఖ్య త్వరలో పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement