గతేడాది మాదిరి ఈ ఏడాది కూడా ప్రాపర్టీ విక్రయాలు బావుంటాయని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎక్సిక్యూటివ్ చైర్మన్ పిరోజ్షా గోద్రేజ్ అన్నారు.కోవిడ్-19 కారణంగా నిర్మాణ రంగ కార్యక్రమాలు నెమ్మదించినప్పటికీ, ప్రాపర్టీ కంపెనీలు ప్రాజెక్టులను పూర్తిచేసే ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.గత ఆర్థిక సంవత్సరం గోద్రేజ్ ప్రాపర్టీస్లో రూ.5,915 కోట్ల రికార్డు స్థాయి బుకింగ్స్ జరిగాయని ఈ ఆర్థిక సంవత్సరంలో అదే స్థాయి విక్రయాలు జరుగుతాయని పిరోజ్షా ధీమా వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి రెండు నెలల కాలంలో గోద్రేజ్ ప్రాపర్టీస్ బుకింగ్స్ పెరిగాయని,మార్చి నెల చివరి 10-15 రోజుల్లో కూడా అమ్మకాలు జరిపామని తెలిపారు. లాక్డౌన్ కారణంగా మార్చి 25 నుంచి నిర్మాణ రంగ పనులతోపాటు, భౌతిక విక్రయాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లోకూడా అమ్మకాలు మంచిగా జరిగి ఈ ఆర్థిక సంవత్సరం కూడా బావుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐ కొనుగోలు దారులపై సంస్థ ఆసక్తి కనబరుస్తుందన్నారు. డిజిటల్ ప్లాట్ఫాం ద్వారా 10-15 శాతం ఎన్ఆర్ఐలు విక్రయాల బుకింగ్స్ జరిగాయని,లాక్డౌన్ కాలంలో ఇది ఎంతో సాయపడిందని తెలిపారు.
నగదు ప్రవాహ పరిస్థితి, నిర్మాణ రంగ పనుల వేగం ఈ ఏడాది పెను సవాళ్లను ఎదుర్కొంటుందని, నగదు ప్రవాహంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అయితే గోద్రేజ్ ప్రాపర్టీస్కు ఎటువంటి నగదు ఇబ్బంది లేదని రూ.2000 కోట్ల బ్యాలెన్స్ షీట్, ఆరోగ్యకరమైన డెట్ ఈక్విటీ రేషియో ఉందని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో హౌసింగ్ మార్కెట్ తీవ్ర సంక్షోభాన్నిఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు, వేతనాల్లో కోతలవల్ల కొనుగోలు శక్తి తీవ్రంగా దెబ్బతింటుదని చెప్పారు. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో గోద్రేజ్ ప్రాపర్టీస్ షేరు దాదాపు 4 శాతం లాభపడి రూ.715.55 వద్ద ముగిసింది.
ఈ ఏడాది విక్రయాలు బావుంటాయ్: గోద్రేజ్ ప్రాపర్టీస్
Published Mon, Jun 1 2020 3:39 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement