తాన్లా బోర్డులోకి ట్రాయ్‌ మాజీ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ | Tanla appoints former TRAI Chief RS Sharma to board of director | Sakshi
Sakshi News home page

తాన్లా బోర్డులోకి ట్రాయ్‌ మాజీ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ

Jan 9 2024 4:48 AM | Updated on Jan 9 2024 4:48 AM

Tanla appoints former TRAI Chief RS Sharma to board of director - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ట్రాయ్‌ మాజీ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మను డైరెక్టర్ల బోర్డులో నియమించినట్లు తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ సోమవారం ప్రకటించింది. దీంతో సంస్థ బోర్డ్‌ డైరెక్టర్ల సంఖ్య ఏడుకు చేరుకుంది. 2015–20 మధ్య ట్రాయ్‌ చైర్మన్‌గా ఆయన విధులు నిర్వర్తించారు.

ఎంపవర్డ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ అడ్మిని్రస్టేషన్‌ ఛైర్మన్‌గా.. భారత్‌లో కోవిడ్‌–19 టీకా కార్యక్రమానికి డిజిటల్‌ వెన్నెముక అయిన కో–విన్‌ రూపకల్పన, అమలుకు నాయకత్వం వహించారు. నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈవోగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలైన ఆయుష్మాన్‌ భారత్‌ జన్‌ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ అమలులో కీలకపాత్ర పోషించారు. 2009–13 మధ్య ఆధార్‌ కార్డుల జారీ సంస్థ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్, మిషన్‌ డైరెక్టర్‌గా పని చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement