దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ పతనాలను అధిగమించి స్వల్ప నష్టాలతో ముగిశాయి. పీఎస్యూ బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్ మద్దతుతో నిఫ్టీ 560, సెన్సెక్స్ సూచీలు రోజు కనిష్ట స్థాయి నుండి గణనీయమైన మొత్తంలో నష్టాలను అధిగమించాయి. నిఫ్టీ 77.95 పాయింట్లు లేదా 0.33 శాతం క్షీణించి 23,405.60 వద్ద, సెన్సెక్స్ 303.67 పాయింట్లు లేదా 0.41 శాతం క్షీణించి 74,346.17 వద్ద ముగిసింది.
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజ్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, మాక్స్ హెల్త్ కేర్ ఇన్ స్టిట్యూట్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. సెన్సెక్స్ లో టీసీఎస్, టెక్ ఎం, హెచ్ సీఎల్ టెక్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.42 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.11 శాతం నష్టపోయాయి.
రంగాల వారీగా నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ అత్యధికంగా పెరిగింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ హెల్త్ కేర్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ ఐటీ 6 శాతానికి పైగా ఇంట్రాడే నష్టంతో అత్యంత చెత్త పనితీరు కనబరిచించింది.


