పండుగ పూట కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ!

Sbi Hikes Mclr By 10 Bps - Sakshi

సంక్రాంతి పండుగ రోజే ఎస్‌బీఐ తన కస్టమర్లకు షాకిచ్చింది. బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాలపై విధించే వడ్డీ రేట్లు పెంచింది. దీంతో హోమ్‌లోన్లు, ఇతర రుణాలపై ఏడాది టెన్యూర్‌ కాలానికి 10 బేసిస్‌ పాయింట్లు పెరిగాయి.పెరిగిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. 

ఎస్‌బీఐ వెబ్‌పోర్ట్‌లో పొందుపరిచిన వడ్డీ రేట్ల ప్రకారం.. ఏడాది ఎంసీఎల్‌ ఆర్‌ రేటు గతంలో 8.3శాతం ఉండగా ఇప్పుడు 8.4 శాతానికి పెరిగింది. అయితే ఇతర టెన్యూర్లలోని ఎంసీఎల్ఆర్ రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నట్లు తెలిపింది.  

ఇక, 2 ఏళ్ల టెన్యూర్‌ కాలానికి ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.50శాతం, 3 ఏళ్ల టెన్యూర్‌ కాలానికి 8.60 శాతంగా ఉంది. ఒక నెల, మూడు నెలల టెన్యూర్‌ కాలానికి ఎంసీఎల్‌ఆర్‌ రేటులో మారకుండా 8 శాతంగా కొనసాగుతుంది. ఓవర్‌నైట్‌ ఎంసీఎల్‌ఆర్‌ రేటు 7.85 శాతంతో తటస్థంగా ఉంది.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top