Samsung: బడ్జెట్‌ ధరలో, బిగ్‌ బ్యాటరీ సపోర్ట్‌తో శాంసంగ్‌ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌..!

Samsung Launches Galaxy A03 Core - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ భారత మార్కెట్లలోకి కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ ‘శాంసంగ్‌ గెలాక్సీ ఏ3 కోర్’ను సోమవారం విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5000ఎంఏహెచ్‌ బ్యాటరీతో రానుంది. బ్లాక్‌, బ్లూ కలర్‌ వేరియంట్స్‌తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. 2జీబీ+32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో శాంసంగ్‌ గెలాక్సీ ఏ3 కోర్ రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చును. అంతేకాకుండా ప్రముఖ ఆన్‌లైన్‌ పోర్టల్స్‌లో కూడా లభిస్తాయి. శాంసంగ్‌ గెలాక్సీ ఏ3 కోర్ ధర రూ. 7999. ఆండ్రాయిడ్‌ గో ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో రానుంది.   

శాంసంగ్‌ గెలాక్సీ ఏ3 కోర్ ఫీచర్స్‌..!

  • 6.5-అంగుళాల ఇన్ఫినిటీ-V డిస్ప్లే
  • ఆక్టా-కోర్ యునిసోక్ SC9863A ప్రాసెసర్‌
  • 2జీబీ ర్యామ్‌+32 ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 8ఎంపీ రియర్‌ కెమెరా
  • 5ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
  • 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ

చదవండి: గూగుల్‌లో పిజ్జా సింబల్‌ క్లిక్‌ చేస్తే ఏమవుతుంది? అసలు ‘పిజ్జా’ విలువ ఎంతంటే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top