Rupee Rises 44 Paise To 79.30 Against The US Dollar In Early Trade - Sakshi
Sakshi News home page

దిగొస్తున్న చమురు ధర: రూపాయి పైపైకి

Aug 17 2022 11:38 AM | Updated on Aug 17 2022 12:37 PM

Rupee rises 44 paise to against US dollar Tracking A Fall In Oil Prices - Sakshi

సాక్షి, ముంబై: ప్రపంచ ఇంధన ధరలు ఆరు నెలల కనిష్టానికి పడిపోవడంతో దేశీయ కరెన్సీ రూపాయికి ఉత్సాహం వచ్చింది. డాలరు మారకంలో రూపాయి ఒక్కసారిగా 44 పైసలు జంప్‌ చేసింది. బుధవారం ట్రేడింగ్‌ ఆరంభంలో రూపాయి 79.32 వద్దకు చేరింది. శుక్రవారం సెషన్‌లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 79.74 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. (బుల్‌ దౌడు, 60వేల ఎగువకు సెన్సెక్స్‌)

ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు ఆరు నెలల కనిష్ట స్థాయి నుండి కోలుకుంది. బుధవారం  0.34 శాతం పెరిగి 92.65 డాలర్లకు చేరుకుంది. డాలర్ ఇండెక్స్ 0.06 శాతం క్షీణించి 106.44కి చేరుకుంది. అలాగే  విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మంగళవారం క్యాపిటల్ మార్కెట్‌లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఒక్క మంగళవారం  ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం రూ. 1,376.84 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఆగస్టు మొదటి రెండు వారాల్లో రూ. 22,452 కోట్ల మేర కొనుగోళ్లు చేయడం గమనార్హం.

దీంతోపాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య  దేశీయ ఈక్విటీలలో జోరు ఫారెక్స్‌ పెట్టుబడి దారుల దృష్టిని సానుకూలంగా మార్చిందని  ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ఈక్విటీ మార్కెట్‌లో కొనుగోలుదారుల మద్దతుతో సెన్సెక్స్‌ 60వేల వద్ద,  నిఫ్టీ 18 వేల వైపు పరుగులు తీస్తోంది. ఇండిపెండెన్స్‌డే, పార్సీ నూతన సంవత్సరం సందర్భంగా  ఫారెక్స్ మార్కెట్లు వరుసగా సోమవారం, మంగళవారం  పనిచేయలేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement