Jio Change Data Offered Under the Rs.1 Plan Benefits - Sakshi
Sakshi News home page

ఒక్కరోజులో ఒక్కరూపాయి-100ఎంబీ డేటా ప్యాక్‌ తుస్స్‌! కారణం ఇదే.

Dec 17 2021 8:11 AM | Updated on Dec 17 2021 9:26 AM

Reliance Jio Changed Cheap Internet Plan Amid Trai objections - Sakshi

ఒక్క రూపాయి 100 ఎంబీ 30డేస్‌ వాలిడిటీ ప్యాక్‌ను రాత్రికి రాత్రే.. 

 కేవలం ఒక్క రూపాయికే 100ఎంబీ ఇంటర్నెట్‌ డేటా.. అదీ 30 రోజుల వాలిడిటీ ప్రకటనతో టెలికాం రంగంలోనే సంచలనానికి తెర లేపింది రిలయన్స్‌ జియో. అయితే ఒక్క రోజులోనే ఉస్సూరుమనిపిస్తూ ఆ ఆఫర్‌ను సవరించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. 


మంగళవారం రాత్రి దాటాక మైజియో మొబైల్‌ యాప్‌లో గప్‌చుప్‌గా వాల్యూ ప్లాన్‌ కింద ఈ ఆఫర్‌ను చేర్చింది జియో. ఒక్క రూపాయికే 100 ఎంబీ డేటాను, 30 రోజుల వాలిడిటీతో అందించింది. అయితే 24 గంటల తర్వాత ఆ ప్లాన్‌ మాయమైంది. దాని ప్లేస్‌లో 1రూ. రీచార్జ్‌తో కేవలం 10 ఎంబీ.. అదీ ఒక్కరోజూ వాలిడిటీతో సవరించింది. దీంతో చాలామంది రిలయన్స్‌ జియో ప్రకటన వార్తలను ఫేక్‌గా భావించారు. అయితే జియో ఈ ప్యాక్‌ను ఆఫర్‌ చేసిన విషయం వందకు వంద శాతం వాస్తవం. 


ప్యాక్‌ ఎందుకు సవరించారనే దానిపై రిలయన్స్‌ జియో నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, తోటి టెలికామ్‌ సంస్థల నుంచి వచ్చిన అభ్యంతరాలే జియో వెనక్కి తగ్గడానికి కారణమని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో టెలికాం కంపెనీలన్నీ(జియో)తో సహా టారిఫ్‌లను పెంచేశాయి. ఈ క్రమంలో ఒకదానిపై ఒకటి ఫిర్యాదులు చేసుకున్నాయి కూడా. అయితే  ఏ టెలికాం సంస్థ కూడా ఇంత చీప్‌గా డేటా ప్యాక్‌ను ఆఫర్‌ చేయట్లేదన్న విషయాన్ని సైతం టెలికాం రెగ్యులేటరీ బాడీ ‘ట్రాయ్‌’ జియో మేనేజ్‌మెంట్‌ వద్ద లేవనెత్తినట్లు ట్రాయ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 

ఈ అభ్యంతరాల నేపథ్యంలో జియో తన చీపెస్ట్‌ ఇంటర్నెట్‌ ప్యాక్‌ను సైలెంట్‌గా మార్చేసింది. అయితే ఆ సమయానికి ఎవరైతే 1రూ. 100 ఎంబీ ప్యాక్‌కు రీఛార్జ్‌ చేశారో వాళ్లకు మాత్రం ప్లాన్‌ను వర్తింపజేస్తూ జియో ఊరట ఇచ్చింది.

చదవండి: జియో యూజర్లకు 20 శాతం క్యాష్‌బ్యాక్‌! ఎలాగంటే..

Advertisement
 
Advertisement
Advertisement