నిస్సాన్‌ తొలి కాంపాక్ట్‌ ఎస్‌యూవీ లాంచ్‌ | Nissan first Magnite SUV launched | Sakshi
Sakshi News home page

నిస్సాన్‌ తొలి కాంపాక్ట్‌ ఎస్‌యూవీ లాంచ్‌

Dec 3 2020 8:09 AM | Updated on Dec 3 2020 8:09 AM

Nissan first Magnite SUV launched  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత వాహన రంగంలో అధిక పోటీ ఉండే కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలోకి నిస్సాన్‌ మోటార్‌ అడుగుపెట్టింది. ప్రారంభ ధర రూ.4.99 లక్షలతో బుధవారం తన  కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘మాగ్నైట్‌’ మోడల్‌ను  ఆవిష్కరించింది. మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్స్‌ ఆప్షన్లలో ఇది లభ్యమవుతుంది. ఈ మోడల్‌ దేశంలోని మారుతీ విటారా, బ్రెజా, హ్యుందాయ్‌ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్,  మహీంద్రా ఎక్స్‌యూవీ 300 హోండా డబ్ల్యూఆర్‌–వీలతో పోటీ పడనుంది. ఈ కారు రెండు పెట్రోల్‌ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.

ఒక లీటరు పెట్రోల్‌ వేరియంట్‌లో లభ్యమయ్యే మోడల్‌ ధరలు రూ.4.99– రూ.7.55 లక్షల మధ్య ఉండగా..,  ఒక లీటరు టర్బో పెట్రోల్‌ వేరియంట్‌ మోడల్‌ ధరలు రూ.6.99–రూ.8.45 లక్షల మధ్య ఉన్నాయి. ఈ ధరలు ఈ ఏడాది చివరి తేది డిసెంబర్‌ 31 నాటి వరకే వర్తిస్తాయి. ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ యాపిల్‌ కార్డ్‌ప్లే, అండ్రాయిడ్‌ ఆటో, టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, ఆటోమేటిక్‌ ఏసీ, పుష్‌బటన్‌ స్టార్ట్, క్రూజ్‌కంట్రోల్‌ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement