Today StockMarket Closing: లాభాల్లోకి సూచీలు, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ టాప్‌ లూజర్‌

Nifty ends at 17900 Sensex gains 142 points - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీ సూచీలు గురువారం లాభాల్లో ముగిసాయి. మిడ్‌సెషన్‌ తరువాత కోలుకున్న సెన్సెక్స్ 142  పాయింట్లు  ఎగిసి 60,806 వద్ద, నిఫ్టీ  22 పాయింట్ల లాభంతో 17894  వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడగా అదానీ గ్రూపు షేర్లు మాత్రం నష్టాల్లోనే ముగిసాయి.  అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్ టాప్‌ లూజర్స్‌గా మిగిలాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్‌లో ముగిశాయి.

సెన్సెక్స్‌లో  దివీస్‌  ల్యాబ్స్‌, హీరో మోటో,  సిప్లా, జేఎస్‌డబ్ల్యూ, స్టీల్‌,  యూపీఎల్‌ టాప్‌ లూజర్స్‌గా బజాజ్ ఫైనాన్స్, గ్రాసిం , బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ , హిందాల్కో,  ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌ టాప్ గెయినర్లు గా ఉన్నాయి.
అటు డాలరు మారకంలో  రూపాయిడాలర్‌తో రూపాయి స్థిరంగా 82.51 వద్ద ముగిసింది 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top