Mi Clearance Sale: సగం ధరకే రెడ్ మీ స్మార్ట్‌ఫోన్స్‌.. ఎక్కడంటే..!

Mi clearance sale 2022 Redmi phones at half price check top deals - Sakshi

సాక్షి,ముంబై: స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రెడ్‌మీ పేరెంట్‌ కంపెనీ ఎంఐ క్లియరెన్స్‌ సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్‌ అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను అందిస్తోంది. ఈ సేల్‌లో కొనుగోలుదారులు రూ. 3,999కే స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎంఐ క్లియరెన్స్ సేల్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో  పొందుపర్చింది. దీని ప్రకారం రెడ్ మీ 6ఏ, రెడ్ మీ వై3, రెడ్ మీ నోట్ 7 ప్రో. వంటి మోడల్స్ ను దాదాపు సగం ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఎంట్రీ-లెవల్ బడ్జెట్ ఫోన్ రెడ్ మీ 6ఏ మోడల్ ప్రారంభ ధర రూ.6,999 కాగా, క్లియరెన్స్ సేల్ లో దీన్ని రూ. 3,999కి అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఫీచర్లతో,  2జీ ర్యామ్, 16జీబీ స్టోరేజీతో వచ్చిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 6ఏ, దీంతోపాటు మిగతా మోడళ్లను కూడా తక్కువకే ఎంఐ సేల్‌లో లభ్యం. అయితే ఈ సేల్‌లో తగ్గింపుతో కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్‌లు వారంటీని కలిగి ఉండవు అనేది గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top