కాకినాడలో పెన్సిలిన్‌–జీ ప్లాంటు ప్రారంభం | Lyfius Pharma Penicillin G plant inaugurated | Sakshi
Sakshi News home page

కాకినాడలో పెన్సిలిన్‌–జీ ప్లాంటు ప్రారంభం

Oct 30 2024 7:20 AM | Updated on Oct 30 2024 8:07 AM

Lyfius Pharma Penicillin G plant inaugurated

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెన్సిలిన్‌–జి ఉత్పత్తి కోసం కాకినాడలో నెలకొల్పిన ప్లాంటును ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించినట్లు ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మాలో భాగమైన లిఫియస్‌ ఫార్మా వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపింది.

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద రూ. 2,500 కోట్ల వ్యూహాత్మక పెట్టుబడులతో ఈ ప్లాంటు ఏర్పాటైంది. ఈ ప్లాంటు వార్షికోత్పత్తి సామర్ధ్యం 15,000 మెట్రిక్‌ టన్నులుగా (ఎంటీ) ఉంటుందని సంస్థ డైరెక్టర్‌ ఎంవీ రామకృష్ణ తెలిపారు.

భారత్‌ను ఫార్మా తయారీ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో స్వయంసమృద్ధి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో కంపెనీ తన వంతు తోడ్పాటును అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నాంది పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement