రుణ సంక్షోభంలో అనిల్‌ అంబానీ కంపెనీ..ఈవేలానికి రిలయన్స్‌ క్యాపిటల్‌ రెడీ

Lenders Of Reliance Capital Finalise E-auction Process For Bidders - Sakshi

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న అనిల్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ క్యాపిటల్‌ విక్రయానికి ఈవేలం నిర్వహించేందుకు విధానాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

వేలం విధానాలు, నిబంధనలను రుణదాతలు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ఈ నెల 19న ఈవేలం ప్రారంభంకానున్నట్లు తెలియజేశాయి. 

కాస్మియా పిరమల్‌ కన్సార్షియం వేసిన రూ. 5,300 కోట్ల బిడ్‌ను వేలానికి ప్రాథమిక ధరగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రౌండ్‌ 1లో భాగంగా బిడ్డర్లు ఈ ధరకుపైన కోట్‌ చేయవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు వివరించాయి. ఒక ఎన్‌బీఎఫ్‌సీ రుణ పరిష్కార ప్రణాళిక కోసం ఈస్థాయిలో ఈవేలాన్ని నిర్వహించడం ఇదే తొలిసారని తెలియజేశాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top