ఐపీవోకి జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా | JSW Infrastructure to raise Rs 2800 cr via IPO | Sakshi
Sakshi News home page

ఐపీవోకి జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా

May 11 2023 4:11 AM | Updated on May 11 2023 4:11 AM

JSW Infrastructure to raise Rs 2800 cr via IPO - Sakshi

న్యూఢిల్లీ: రుణ భారాన్ని తగ్గించుకునేందుకు, విస్తరణ ప్రణాళికలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పబ్లిక్‌ ఇష్యూకి (ఐపీవో) రానుంది. దీని ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ) నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది.

ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో భాగమైన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌.. స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్టయి ఉన్నాయి. దీంతో గ్రూప్‌ నుంచి జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా మూడో లిస్టెడ్‌ కంపెనీ కానుంది. కంపెనీకి వార్షికంగా 153.43 మిలియన్‌ టన్నుల కమోడిటీ కార్గో హ్యాండ్లింగ్‌ స్థాపిత సామర్థ్యం ఉంది. 2022 డిసెంబర్‌ 31 నాటికి సంస్థకు నికరంగా రూ. 2,875 కోట్ల రుణాలు ఉన్నాయి. 2022–23 అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా రూ. 447 కోట్ల నికర లాభం ఆర్జించింది.

Advertisement
 
Advertisement
Advertisement