ఎట్టకేలకు తిరిగి ప్రారంభంకానున్న ఇస్రో ప్రయోగం..!

ISRO Plans To Launch GISAT 1 Geo Imaging Satellite - Sakshi

బెంగుళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది.ఆగస్టు 12 న జిఎస్ఎల్వి-ఎఫ్ 10 రాకెట్‌ ద్వారా జియో ఇమేజింగ్ ఉపగ్రహం జిశాట్ -1 కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని ఇస్రో భావిస్తోంది. ఈ ప్రయోగం 2021 వ సంవత్పరంలో ఇస్రో జరపబోయే రెండో ప్రయోగం. బ్రెజిల్‌కు చెందిన ఎర్త్‌ ఆబ్సర్వేషన్‌ శాటిలైట్‌ అమెజోనియా -1తో పాటుగా మరో 18 శాటిలైట్లను పీఎస్‌ఎల్వీ- సీ51 రాకెట్ తో ఫిబ్రవరి 28 రోజున ప్రయోగించింది. ఈ ప్రయోగంలో కొంతమంది విద్యార్థులు తయారుచేసిన శాటిలైట్లు కూడా ఉన్నాయి.

2,268 కిలోల బరువున్న జిశాట్‌-1 ఉపగ్రహాన్ని గత ఏడాది మార్చి 5 న ప్రయోగించాలని నిర్ణయించినప్పటికీ సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని నిలిపివేశారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభించడంతో జీశాట్‌-1 ప్రయోగం ఆలస్యమైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు 12 న ఉదయం 05.43 గంటలకు జీఎస్‌ఎల్‌వి-ఎఫ్ 10 లాంచ్‌  వెహికిల్‌తో జీశాట్‌-1ను ప్రయోగిస్తామని ఇస్రో అధికారులు శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.

GISAT-1 ప్రయోగంతో భారత ఉపఖండ పరిశీలనకు దోహదపడుతుందని తెలిపారు. GISAT-1 ను GSLV-F10 రాకెట్‌తో జియోసింక్రోనస్  కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం దేశ సరిహద్దుల రియల్‌ టైం చిత్రాలను అందిస్తోంది. అంతేకాకుండా  ప్రకృతి వైపరీత్యాలను త్వరగా పర్యవేక్షించటానికి వీలు కల్పిస్తుంది. ఆన్బోర్డ్ హై రిజల్యూషన్ కెమెరాలతో,  భారతీయ భూభాగం, మహాసముద్రాలను, ముఖ్యంగా దాని సరిహద్దులను నిరంతరం పర్యవేక్షించడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతోందని ఇస్రో అధికారులు పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top