పాలసీ జారీ తర్వాతే ప్రీమియం వసూలు | IRDAI introduced a new rule Bima ASBA for insurance premium payments | Sakshi
Sakshi News home page

పాలసీ జారీ తర్వాతే ప్రీమియం వసూలు

Feb 20 2025 8:49 AM | Updated on Feb 20 2025 11:25 AM

IRDAI introduced a new rule Bima ASBA for insurance premium payments

కొత్తగా బీమా పాలసీలు తీసుకునే వారి సౌలభ్యం కోసం బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. పాలసీ జారీ చేసిన తర్వాతే అందుకు సంబంధించి ప్రీమియం వసూలు చేసుకునేందుకు వీలుగా.. బీమా–ఏఎస్‌బీఏ(Bima-Applications Supported by Blocked Amount) సదుపాయాన్ని అందించాలంటూ అన్ని బీమా సంస్థలను ఆదేశించింది.

ఇదీ చదవండి: విద్యుత్‌ రంగంలో రూ.60 లక్షల కోట్ల పెట్టుబడులు

పాలసీ జారీ అయ్యేంత వరకు ప్రీమియంకు సరిపడా మొత్తం కస్టమర్‌ బ్యాంక్‌ ఖాతాలో బ్లాక్‌ అయి ఉంటుంది. ప్రస్తుతం ఐపీవోలకు ఈ విధానం అమల్లో ఉంది. దీన్ని అప్లికేషన్‌ సపోర్టెడ్‌ బై బ్లాక్డ్‌ అమౌంట్‌ (ఏఎస్‌బీఏ) సదుపాయంగా చెబుతారు. ఇదే మాదిరి బీమా–ఏఎస్‌బీఏ విధానాన్ని బీమా పాలసీలకు అమలు చేయాలని ఐఆర్‌డీఏఐ సూచించింది. మార్చి 1 నాటికి ఈ సదుపాయాన్ని అమల్లోకి తీసుకురావాలని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఈ విధానంలో ప్రపోజల్‌ను ఆమోదిస్తున్నట్టు బీమా సంస్థ కస్టమర్‌కు తెలియజేసిన తర్వాతే, ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్‌డీఏఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement