2035 నాటికి ట్రిలియన్‌ డాలర్లు | Indian automobile industry capable of becoming export-led 1 trillion dollers by 2035 | Sakshi
Sakshi News home page

2035 నాటికి ట్రిలియన్‌ డాలర్లు

Oct 5 2023 6:18 AM | Updated on Oct 5 2023 6:18 AM

Indian automobile industry capable of becoming export-led 1 trillion dollers by 2035 - Sakshi

న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్‌ రంగం 2035 నాటికి ఎగుమతి ఆధారిత ట్రిలియన్‌ డాలర్‌ పరిశ్రమగా ఎదిగే అవకాశం ఉందని ఆర్థర్‌ డి లిటిల్‌ నివేదిక పేర్కొంది. తయారీ, ఆవిష్కరణలు, సాంకేతికత తోడుగా పరిశ్రమ ఈ స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ‘భారత వాహన పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లకు డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తికి ఆకర్షణీయ  ప్రపంచ కేంద్రంగా మారవచ్చు.

దీనిని సాధించడానికి ఈ రంగంలోని కంపెనీలు ప్రపంచ తయారీకి అనుగుణంగా తమ సామర్థ్యాలను విశ్వసనీయ, పోటీతత్వంగా మెరుగుపర్చుకోవాలి. జోనల్‌ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌ వంటి కొత్త సాంకేతికతలకు అనుగుణంగా పరిష్కారాలను అందించడం ద్వారా ఆటోమోటివ్‌ సాఫ్ట్‌వేర్, ఇంజనీరింగ్‌ పరిశోధన, అభివృద్ధిలో భారత శక్తి సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. నిధులతో కూడిన స్టార్టప్‌ పర్యావరణ వ్యవస్థతో భారతదేశం వాహన రంగంలో నాయకత్వ స్థానంలో ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంది’ అని వివరించింది.  

నాయకత్వ స్థానంగా..: దేశీ వాహన రంగంలో పెరుగుతున్న ఆవిష్కరణల వేగాన్ని, మారుతున్న సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించినట్లయితే భారతదేశాన్ని ప్రపంచ ఆటోమోటివ్‌ రంగంలో నాయకత్వ స్థానంగా మార్చవచ్చని నివేదిక తెలిపింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్‌ పరిశోధన, అభివృద్ధి, సాఫ్ట్‌వేర్‌ మార్కెట్‌ 2030 నాటికి మూడు రెట్లు వృద్ధి చెంది 400 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. భారతదేశం ప్రపంచ  సాఫ్ట్‌వేర్‌ హబ్‌గా, ఆఫ్‌షోర్‌ గమ్యస్థానంగా తన స్థానాన్ని ఉపయోగించుకోవచ్చు. భారత వాహన పరిశ్రమ నిజమైన సామర్థ్యాన్ని సది్వనియోగం చేసుకోవడానికి ప్రభుత్వంతో సహా ముడిపడి ఉన్న భాగస్వాముల మధ్య బలమైన చర్చలు, సమిష్టి చర్యలు అవసరం’ అని నివేదిక వివరించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement