5జీ యూజర్లు @ 98 కోట్లు..! | India 5G subscribers base to reach 98 crores | Sakshi
Sakshi News home page

5జీ యూజర్లు @ 98 కోట్లు..!

Jun 26 2025 6:31 AM | Updated on Jun 26 2025 6:31 AM

India 5G subscribers base to reach 98 crores

23 కోట్లకు 4జీ చందాదారులు  

ఒక్కో ఫోన్‌ డేటా వినియోగం 66జీబీ 

2030 నాటికి చేరుకోవచ్చు 

ఎరిక్సన్‌ మొబిలిటీ నివేదిక  

న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ టెలికం యూజర్లు (చందాదారులు) 2030 నాటికి 98 కోట్లకు చేరుకుంటారని, అప్పటికి 4జీ చందాదారుల సంఖ్య 60 శాతం తగ్గి 23 కోట్లకు పరిమితం అవుతుందని టెలికం గేర్ల తయారీ సంస్థ ఎరిక్సన్‌ తెలిపింది. ‘‘2024 చివరికి 5జీ చందాదారులు 29 కోట్లకు పెరిగారు. మొత్తం మొబైల్‌ సబ్‌్రస్కిప్షన్లలో 24 శాతంగా ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 98 కోట్లకు చేరుకుంటుంది. మొత్తం చందాదారుల్లో 5జీ యూజర్లు 75 శాతానికి పెరుగుతారు’’అని ఎరిక్సన్‌ మొబిలిటీ రిపోర్ట్‌ వెల్లడించింది. 2024లో ఒక్కో స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా 32జీబీ డేటా వినియోగంతో భారత్‌ ప్రపంచంలో డేటా రద్దీ పరంగా మొదటి స్థానంలో నిలిచినట్టు తెలిపింది.

 2030 నాటికి ఒక్కో స్మార్ట్‌ఫోన్‌ డేటా వినియోగం 66జీబీకి పెరుగుతుందని అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా బలమైన 5జీ నెట్‌వర్క్‌ అవసరం ఉంటుందని పేర్కొంది. వేగంగా 5జీ స్మార్ట్‌ఫోన్లకు యూజర్లు మారుతుండడం, డేటా వినియోగానికి డిమాండ్‌ పెరుగుతున్నట్టు వివరించింది. ‘‘బ్రాడ్‌బ్యాండ్‌ అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. 5జీ ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ (ఎఫ్‌డబ్ల్యూఏ) విస్తరణ దిశగా సరీ్వస్‌ ప్రొవైడర్లను ఈ డిమాండ్‌ నడిపిస్తుంది. భారత్‌లో అందుబాటులో ఉన్న 5జీ మిడ్‌బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌.. సామర్థ్యం, నెట్‌వర్క్‌ విస్తరణ అవసరాలకు సరిపోతుంది. ఇది యూజర్‌ అనుభవం పెరిగేందుకు వీలు కలి్పస్తుంది’’అని ఎరిక్సన్‌ నివేదిక వివరించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement