మినిమం బ్యాలెన్స్ రూ.50 వేలు ఉండాల్సిందే! | ICICI Bank Raises Minimum Balance Requirement | Sakshi
Sakshi News home page

మినిమం బ్యాలెన్స్ రూ.50 వేలు ఉండాల్సిందే!

Aug 9 2025 2:29 PM | Updated on Aug 9 2025 3:02 PM

ICICI Bank Raises Minimum Balance Requirement

దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం 'ఐసీఐసీఐ' (ICICI) సంచలన నిర్ణయం తీసుకుంది. మినిమమ్‌ బ్యాలెన్స్‌ రూ.50 వేలకు పెంచుతూ కీలక సవరణ చేసింది. 2025 ఆగస్టు 1 అమలులోకి వచ్చేలా.. సేవింగ్స్‌ ఖాతాలకు మినిమం మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ (MAB)ను గణనీయంగా పెంచుతున్నట్లు పేర్కొంది.

ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకారం.. మెట్రో, పట్టణ శాఖలలోని వినియోగదారులు మినిమం బ్యాలెన్స్ రూ. 50,000 నిర్వహించాలి. గతంలో ఈ బ్యాలెన్స్ రూ. 10,000గా ఉండేది. 

సెమీ అర్బన్ ప్రాంతాలలో వినియోగదారులు బ్యాలెన్స్‌ రూ. 5000 నుంచి రూ. 25వేలకు పెరిగింది. గ్రామీణ ఖాతాలను రూ. 2500 నుంచి రూ. 10,000కు పెంచింది. ఖాతాదారులు ఈ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోకపోతే.. భారీ జరిమానాలు చెల్లించాల్సిందే. ఇదే బాటలో ఇతర ప్రైవేట్ బ్యాంకులు కూడా అడుగులు వేస్తే.. ఖాతాదారులు తమ ఖాతాల్లో వేల రూపాయలు ఉంచుకోక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement