బీఈఎల్‌తో హెచ్‌ఏఎల్‌ రూ. 2,400 కోట్ల ఒప్పందం

HAL with BEL for Rs. 2,400 crore deal - Sakshi

బెంగళూరు: ప్రభుత్వ రంగ దిగ్గజం హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ నుంచి రూ. 2,400 కోట్ల కాంట్రాక్టును భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ (బీఈఎల్‌) దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తేలికపాటి యుద్ధ విమానాలు (ఎల్‌సీఏ) తేజాస్‌ ఎంకే1ఏలకు అవసరమైన 20 రకాల ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌ను (ఎల్‌ఆర్‌యూ మొదలైనవి) బీఈఎల్‌ తయారీ చేసి, సరఫరా చేయాల్సి ఉంటుంది. 2023 నుంచి 2028 వరకూ అయిదేళ్ల వరకూ ఈ కాంట్రాక్టు కాలపరిమితి ఉంటుంది. మరోవైపు, 83 తేజాస్‌ ఎంకే1ఏలను భారత వైమానిక దశానికి 2023–24 నుంచి అందించడం మొదలవుతుందని హెచ్‌ఏఎల్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top