బంగారం ధరల్లో రోజురోజుకి ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఒకరోజు తగ్గుముఖం పడితే.. మరోరోజు భారీగా పెరగడం. ఇంకోరోజు ధరలు స్థిరంగా ఉండిపోవడం. ఇలా గోల్డ్ రేటు ముందుకు సాగుతోంది. ఈ కథనంలో వారం (జులై 19 నుంచి 25 వరకు) రోజుల్లో పసిడి ధరలు ఎలాంటి మార్పునకు లోనైంది. తాజా ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.
హైదరాబాద్, విజయవాడలలో గత ఆదివారం (జులై 19) రూ.1,43,290 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర జులై 25 నాటికి రూ.1,44,930 వద్దకు (రూ.1640 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,31,350 నుంచి రూ.1,32,850 వద్దకు (రూ.1500 పెరిగింది) చేరింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర ఏడు రోజుల్లో రూ.1,43,440 నుంచి రూ.1,45,080 వద్దకు (రూ.1640 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,31,450 నుంచి రూ.1,33,000 వద్దకు (రూ.1550 పెరిగింది) చేరింది. దీన్ని బట్టి చూస్తే వారం రోజుల్లో గోల్డ్ రేటు ఎంత పెరిగిందో స్పష్టంగా అర్థమవుతోంది.
చెన్నైలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పులు కనిపించాయి. జులై 19న రూ.1,43,290 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం పసిడి ధర జులై 25 నాటికి రూ.1,45,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,31,350 నుంచి రూ.1,33,000 వద్దకు చేరింది.
వెండి ధరలు
భారతదేశంలో సిల్వర్ రేటు కూడా వారం రోజుల్లో గణనీయమైన మార్పుకునకు లోనైంది. దీంతో కేజీ వెండి రేటు ఏడు రోజుల్లో రూ.2.35 లక్షల నుంచి రూ.1.40 లక్షలకు చేరింది. అంటే రూ.5000 పెరిగిందన్నమాట.


