డుకాటీ బైక్‌ @ 23 లక్షలు

Ducati Recently Launched Two Adventure Tourer Models In India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సూపర్‌ బైక్స్‌ తయారీలో ఉన్న ఇటలీ దిగ్గజం డుకాటీ తాజాగా భారత్‌లో రెండు అడ్వెంచర్‌ టూరర్‌ మోడళ్లను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర మల్టీస్ట్రాడా వీ4 రూ.18.99 లక్షలు కాగా వీ4–ఎస్‌ రూ.23.10 లక్షలు ఉంది. 10,500 ఆర్‌పీఎంతో 170 హెచ్‌పీ పవర్‌ వీ4 గ్రాన్‌టూరిస్మో ఇంజిన్‌ పొందుపరిచారు. రోడ్, ఆఫ్‌–రోడ్‌ వినియోగం కోసం ఇంజిన్‌ను డిజైన్‌ చేశారు. రైడింగ్‌ మరింత సౌకర్యవంతం చేసేందుకు వీ4 ఎస్‌ మోడల్‌కు రాడార్‌ టెక్నాలజీని వినియోగించారు. ఇది వేగాన్ని నియంత్రించడంతోపాటు వెనుక నుంచి వాహనాలు వస్తే హెచ్చరిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top